దాతలు స్పందించండి
సత్తుపల్లి మండలంలోని పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు గంగారానికి చెందిన దాసరి ఉదయ్కుమార్రెడ్డి గత డిసెంబరు 15 నుంచి ఉదయం, సాయంత్రం అల్పాహారం వితరణ చేస్తున్నారు.
పది విద్యార్థులకు అల్పాహారం అందించండి
ఎర్రుపాలెం మండలంలోని భీమవరం ఉన్నత పాఠశాలలో దాతల సాయంతో పదో తరగతి చదివే విద్యార్థులకు ఎనిమిదేళ్లుగా సాయంత్రం వేళ అల్పాహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం 32 మంది పది విద్యార్థులున్నారు. ఈ ఏడాది అల్పాహారానికి దాతలు వై.పూర్ణచంద్రారెడ్డి, సీహెచ్.కిషోర్, ఎస్.కృష్ణారెడ్డి, ఎస్.కృష్ణారావు, ఎస్.జయలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, ఎ.కృష్ణారావు, బహదూర్ఖాన్లు సాయం అందించారు.
ఎర్రుపాలెం, న్యూస్టుడే
నామవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. దాత సంకెళ్ల పాపారావు సహకారంతో ఈ ఏడాది నుంచి అల్పాహారం సమకూరుస్తున్నారు.
చింతకాని, న్యూస్టుడే
సత్తుపల్లి, న్యూస్టుడే: సత్తుపల్లి మండలంలోని పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు గంగారానికి చెందిన దాసరి ఉదయ్కుమార్రెడ్డి గత డిసెంబరు 15 నుంచి ఉదయం, సాయంత్రం అల్పాహారం వితరణ చేస్తున్నారు. ఉదయం ఇడ్లీ, గోధుమరవ్వ ఉప్మా, ఎగ్రైస్, వెజ్బిర్యానీ, బోండా, ఊతప్పం వంటి అల్పాహారంతోపాటు సాయంత్రం అరటి పండ్లు, బిస్కెట్లు, పల్లీ ఉండలు, శనగలు, పల్లీలు, గుగ్గీల్లు వంటి స్నాక్స్ సరఫరా చేస్తున్నారు.
ప్రత్యేక తరగతులు ఇలా..
విద్యాశాఖ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 9 నుంచి మార్చి 10 వరకు రోజుకు రెండు గంటల చొప్పున పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.45గంటల వరకు పాఠశాల సమయం కాగా ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల వరకు ఒక సబ్జెక్టు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు మరో సబ్జెక్టును విధిగా ప్రత్యేక తరగతుల్లో బోధించాల్సి ఉంది.
మధ్యాహ్న భోజనంతో సరి
పాఠశాలలున్న గ్రామం నుంచే కాకుండా సమీప ప్రాంతాలనుంచీ విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. ఇలాంటి వారు ఉదయం అల్పాహారం లేకుండానే హడావిడిగా బడికొస్తున్నారు. కేవలం మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుని తిరిగి సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆకలి కడుపులతోనే పాఠాలు వినాల్సిన దుస్థితి చాలామందికీ ఎదురవుతోంది.
మధిర పట్టణం, న్యూస్టుడే
వారు సర్కారు బడుల్లో అభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థులు.. నిరుపేద కుటుంబాలకు చెందిన వారైనా ప్రతిభకు కొదవలేదు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని పట్టుదలతో అభ్యసిస్తున్నారు. ఇందుకోసం అర్ధాకలితోనే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. రోజంతా మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. తరగతుల తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే వరకు మధ్యలో ఎలాంటి ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి అల్పాహారం అందించాలని కోరుతున్నారు.
సాయంలో స్ఫూర్తి దాతలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇది కార్యరూపు దాల్చకున్నా అక్కడక్కడా కొంతమంది దయార్ద హృదయంతో ముందుకు వచ్చి అల్పాహారానికి చేయూత అందిస్తున్నారు. కానీ ఉభయ జిల్లాల్లో 5శాతం పాఠశాలల్లో మాత్రమే ఇది అమలవుతోంది. మిగతా చోట్ల అవస్థలు తప్పడం లేదు. పదో తరగతి విద్యార్థులకు ఈ రెండు నెలల పాటు కనీసం పండ్లు, పాలు, అల్పాహారం లాంటివి అందిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మధిరలోని పీవీఆర్ అండ్ ఎస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్థానిక బాలికోన్నత పాఠశాల, సీపీఎస్ పాఠశాలల్లో ఈ సాయం అందిస్తోంది. అన్నిచోట్లా దాతలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆకలితో ఏకాగ్రత చాలా కష్టం
డా.అనిల్కుమార్, మధిర, ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి
పదో తరగతి పిల్లలు మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేస్తుంటారు. తర్వాత తిన్న భోజనం దాదాపు 3గంటలకు పూర్తిగా జీర్ణమవుతుంది. ఇక సాయంత్రానికి వారిలో శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో అదనపు తరగతులు నిర్వహించినా ఏకాగ్రత సరిగ్గా ఉండదు. గ్లూకోజ్ ఎక్కువ ఉండే పండ్లు లేదా బిస్కెట్లు, పాలు, రొట్టెలు అల్పాహారంగా అందించగలిగితే ప్రయోజనం ఉంటుంది.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
సోమశేఖర శర్మ, ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతుల సమయంలో అల్పాహారం అందించాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల నుంచి వినతులు వచ్చాయి. ఈ సమస్యను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లాం. ప్రభుత్వ నిధుల నుంచి కానీ లేదా దాతల సహకారం తీసుకుని అందించేందుకు మా వంతుగా చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి