విశ్వనాథ్ జీవితం.. సినీ గ్రంథాలయం
తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ జీవితం ఔత్సాహికులకు సినీ గ్రంథాలయం వంటిదని సీనియర్ కళాకారిణి, న్యాయవాది వనం కృష్ణవేణి పేర్కొన్నారు.
సంస్మరణ సభలో వక్తలు
కళాతపస్వికి విశ్వనాథ్కు నివాళులర్పిస్తున్న అతిథులు
ఖమ్మం సాంస్కృతికం, న్యూస్టుడే: తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ జీవితం ఔత్సాహికులకు సినీ గ్రంథాలయం వంటిదని సీనియర్ కళాకారిణి, న్యాయవాది వనం కృష్ణవేణి పేర్కొన్నారు. నగరంలోని ఐఎంఏ హాలులో విశ్వనాథ్ సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం నిర్వహించారు. తొలుత అతిథులు జ్యోతిని వెలిగించి, విశ్వనాథ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. విశ్వనాథ్ క్రమ శిక్షణకు మారు పేరని, ప్రతి సినిమాను ఒక తపస్సులా తీర్చిదిద్దారని కొనియాడారు. నూతన నటీ నటులను ప్రోత్సాహించడంలో ఆయన్ని మించిన దర్శకులు లేరని, తన సినిమాల్లో సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఖమ్మం నగరానికి విశ్వనాథ్ను మూడుసార్లు తీసుకొచ్చే అవకాశం దక్కడం మరువలేనిదన్నారు. ఖమ్మం కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగబత్తిని రవి మాట్లాడుతూ.. ప్రతి సినిమాను యజ్ఞంలా తీయడం విశ్వనాథ్ గొప్పదనం అని, ఆయన మరణం తెలుగు చిత్రసీమకు లోటని పేర్కొన్నారు. గాయకుడు మోదుగు గోవిందు ఆలపించిన విశ్వనాథ్ సినిమాల్లోని గీతాలు ఆకట్టుకున్నాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, కొత్తమాసు హేమసుందర్రావు, రవీందర్, కడవెండి వేణుగోపాల్, మాధవరావు, ఎస్వీ రమణ, బీవీ రెడ్డి, వనం తేజస్వినీ, రాయప్రోలు సుబ్రహ్మణ్యం, కేవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య