తెదేపా సీనియర్ నాయకుడు ప్రకాశ్రావు మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లగడపాటి ప్రకాశ్రావు (77) ఆదివారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు.
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లగడపాటి ప్రకాశ్రావు (77) ఆదివారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ప్రకాశ్రావు కుమారుడు, శ్రీనగర్ ఉపసర్పంచి రమేష్ చంద్కు ఫోన్ చేసి పరామర్శించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రకాశ్రావు జైలుకు వెళ్లొచ్చారు. మలి దశ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. మరణానంతరం ఆయన నేత్రాలను ‘ఖమ్మం నేత్ర నిధి’కి దానం చేశారు. జడ్పీ వైఎస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, సీపీఎం రాష్ట్ర వర్గ సభ్యులు కాసాని అయిలయ్య, పలు పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు సంస్థ ప్రతినిధులు, భవన నిర్మాణ కార్మికులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా