logo

తెదేపా సీనియర్‌ నాయకుడు ప్రకాశ్‌రావు మృతి

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు లగడపాటి ప్రకాశ్‌రావు (77) ఆదివారం ఉదయం శ్రీనగర్‌ కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు.

Published : 06 Feb 2023 05:48 IST

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు లగడపాటి ప్రకాశ్‌రావు (77) ఆదివారం ఉదయం శ్రీనగర్‌ కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ప్రకాశ్‌రావు కుమారుడు, శ్రీనగర్‌ ఉపసర్పంచి రమేష్‌ చంద్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రకాశ్‌రావు జైలుకు వెళ్లొచ్చారు. మలి దశ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. మరణానంతరం ఆయన నేత్రాలను ‘ఖమ్మం నేత్ర నిధి’కి దానం చేశారు. జడ్పీ వైఎస్‌ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, సీపీఎం రాష్ట్ర వర్గ సభ్యులు కాసాని అయిలయ్య, పలు పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు సంస్థ ప్రతినిధులు, భవన నిర్మాణ కార్మికులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని