logo

లారీ, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి మృతి

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఖమ్మంలో జరిగింది. 

Updated : 06 Feb 2023 20:39 IST

ఖమ్మం గ్రామీణం :  ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఖమ్మంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం గ్రామీణ మండలం ఆరేకోడు గ్రామానికి చెందిన కేశాని శ్రీకాంత్‌(44) ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం  పాఠశాలకు వెళ్లేందుకు ఆరేకోడు నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో  మార్గమధ్యలో ఖమ్మం గ్రామీణం మండలం  కరణగిరి వద్ద శ్రీకాంత్‌ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని  వెనుక నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని