బేతుపల్లి రెవెన్యూలో భూమాయ
బేతుపల్లి రెవెన్యూలో అక్రమ భూ బదలాయింపులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. రెవెన్యూ పరిధిలోని 133 సర్వే నంబర్లో దాదాపు 3వేల ఎకరాలకు పైచిలుకు వ్యవసాయ భూములకు అంతకుమించి పాసుపుస్తకాలు ఉండటంతో సమస్య జటిలంగా మారింది.
తవ్వినకొద్దీ వెలుగుచూస్తున్న అక్రమ బదలాయింపులు
గంగారంలో విచారిస్తున్న ఆర్డీఓ సూర్యనారాయణ
సత్తుపల్లి, న్యూస్టుడే: బేతుపల్లి రెవెన్యూలో అక్రమ భూ బదలాయింపులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. రెవెన్యూ పరిధిలోని 133 సర్వే నంబర్లో దాదాపు 3వేల ఎకరాలకు పైచిలుకు వ్యవసాయ భూములకు అంతకుమించి పాసుపుస్తకాలు ఉండటంతో సమస్య జటిలంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులతో కొందరు కుమ్మక్కై భూమి లేకుండానే తమపేరిట ధరణిలో నమోదు చేయించుకుని కొత్త పాసుపుస్తకాలు పొందారు. అసలు భూములున్న రైతులు తమ పేరిట రికార్డుల్లో ఎక్కించి పాసుపుస్తకాలు ఇవ్వాలని ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
భూమి ఒకచోట... సరిహద్దులు మరోచోట
వేరే సర్వే నంబర్లోని మిగులు భూమిని తప్పుడు మార్గంలో కొందరు రికార్డుల్లోకి మార్చుకుని తమకు అవసరమైన ప్రాంతాల్లో సరిహద్దులను చూపుతుండటంతో వివాదాలు నెలకొంటున్నాయి. పెద్దమనిషి ముసుగులో ఓవ్యక్తి ఇదే అదునుగా రూ.కోట్ల భూముల సరిహద్దులను మిగులు సర్వే నంబర్లోని రికార్డుల్లో చూపుతూ దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు.అనుమతులు లేకుండా వెంచర్లు వేసి బేరం పెట్టి ప్లాట్లు అమ్ముతుండటంతో పంచాయతీ అధికారులు నోటీసులను సైతం జారీ చేశారు. అక్రమ లేఅవుట్లపై ఇటీవల ‘న్యూస్టుడే’లో కథనం ప్రచురితమవడంతో డీటీసీపీ అధికారులు సదరు ప్లాట్లను పరిశీలించి వారంలోగా అనుమతులు పొందాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత ముత్తా వెంకటేశ్వరరావు అనే రైతు బేతుపల్లి రెవెన్యూ 133/164/4 సర్వే నంబర్లోని తన రెండెకరాల భూమిని సదరు పెద్దమనిషి రిజిస్ట్రేషన్ చేసి మోసగించారంటూ ఫిర్యాదుచేయడంతో ఆర్డీఓ విచారణ చేపట్టారు.
లోతైన విచారణ...
ఇటీవల సత్తుపల్లిలో కలెక్టర్ గౌతమ్ పర్యటించగా పలువురు బాధితులు ఆయన్ను కలిసి బేతుపల్లి రెవెన్యూలోని తమ భూ సమస్యలను వెల్లడించారు. దీనిపై విచారణ చేసి నివేదికను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆర్డీవో లోతైన విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఏడుగురు బాధితులు వివిధ భూ సమస్యలపై ఫిర్యాదులు చేయడంతో క్షేత్రస్థాయిలో తప్పులు ఎలా జరిగాయని ఆరా తీస్తున్నారు. ధరణిలోని కొన్ని లొసుగులను రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుసుకున్న అక్రమార్కులు కొత్తరకం దందాకు తెరలేపి దండుకుంటుండటంతో విచారిస్తున్న అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఆర్డీవో పకడ్బందీగా విచారిస్తున్నారు. ఎవరెఎవరి మిగులు భూముల్లో ఎంతమందిపై రిజిస్ట్రేషన్లు చేశారు. సదరు భూముల లింకు డాక్యుమెంట్లు ఎవరిపేరిట ఉన్నాయి? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? భూముల్లేకుండా పాసు పుస్తకాలను దక్కించుకున్నది ఎంతమంది? అసలు సదరు పెద్దమనిషికి ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేశారు.. ఇలా వివిధ కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు.
అక్రమాలపై సీఐడీ విచారణ?
ప్రధానంగా ఇతర గ్రామంలోని పాసుపుస్తకాల్లో సర్వే నంబర్లలోని మిగులు భూమిని రూ.కోట్ల విలువైన భూముల సర్వేనంబర్లున్న చోటు సరిహద్దులు చూపుతూ అక్రమదందాకు తెరలేపిన అంశాన్ని విచారణలో అధికారులు గుర్తించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కలెక్టర్కు రెండు రోజుల్లో నివేదికను సమర్పిస్తామని ఆర్డీఓ తెలిపారు. ఈఅంశంపై సీఐడీ విచారణ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూచువారలకు చూడ ముచ్చట..
[ 18-04-2024]
కల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు. -
నేటి నుంచి నామినేషన్ల ఘట్టం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల క్రతువులో అత్యంత కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారం మొదలుకానుంది. మే 13న జరిగే పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శోకసంద్రంలో ముంచొద్దు..!
[ 18-04-2024]
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు యువత, చిన్నారులు ఈతకెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు చెరువులు, వాగులు, కుంటల్లో సైతం జలకాలాడుతున్నారు. -
నేడు సీతారాముల పట్టాభిషేకం
[ 18-04-2024]
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం మహాపట్టాభిషేకం జరగనుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
దర్గాలో దశరథ తనయుని కల్యాణం
[ 18-04-2024]
భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ నాగుల్మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్లో అర్చకుల వేదమంత్రాల నడుమ బుధవారం శ్రీరామ నవమి వేడుక కనుల పండువగా సాగింది. -
అందుబాటులో ‘అయోధ్య’ తపాలా బిళ్లలు
[ 18-04-2024]
అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన తపాలా బిళ్లలు ఖమ్మం స్టేషన్ రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. రామ మందిరానికి చెందిన ఆరు ప్రముఖ చిత్రాలతో ఆరు తపాలా బిళ్లలు ఉన్నాయి. -
తొట్టెలపాడు..
[ 18-04-2024]
మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి. -
వయసు మూడు.. ఈత చూడు!
[ 18-04-2024]
ఖమ్మం నగరంలోని పటేల్ స్టేడియం ఈత కొలనుల్లో 5 ఏళ్ల లోపు వారికోసం ప్రత్యేకమైన మినీపాండ్ ఉంది. కేవలం వేసవిలో మాత్రమే ఈ మినీపాండ్ అందుబాటులో ఉంటుంది. అడుగు లోతు ఉంటుంది. -
ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి
[ 18-04-2024]
పండుగ పూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... -
అత్తమామలు వేధిస్తున్నారని ఆందోళన
[ 18-04-2024]
భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్తింటివారు వేధిస్తూ, చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రచన అనే మహిళ బోనకల్లులోని తన మామ ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
-
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
-
మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
-
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
-
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు