సౌర కాంతులు
స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్తు యూనిట్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. టీఎస్ రెడ్కోతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది.
- ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే
డీఆర్డీవో విద్యాచందనతో చర్చిస్తున్న టీఎస్ రెడ్కో డీఎం ఉమాకాంత్, స్త్రీనిధి ఆర్ఎం రవీంద్రనాయక్ (పాత చిత్రం)
స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్తు యూనిట్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. టీఎస్ రెడ్కోతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. 200 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్తును గృహ అవసరాలకు వినియోగించే సంఘం సభ్యులకు, ఎన్పీఏ తక్కువ ఉంటే దీనికి ఎంపిక చేస్తారు. వీరి ఇళ్లలో సౌర విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చైతన్యం చేయనున్నారు.
కసరత్తు ప్రారంభం
స్త్రీనిధి నుంచి రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభ్యులు 60 నెలల్లో నెలవారీ వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. 11 శాతం వడ్డీ కలిపి కట్టాలి. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విద్యాచందనతో టీఎస్ రెడ్కో డీఎం ఉమాకాంత్, స్త్రీనిధి ఆర్ఎం రవీంద్రనాయక్ ఇటీవల చర్చించారు. యూనిట్ల ఏర్పాటు, సబ్సిడీ, దరఖాస్తులు, సభ్యుల వాటాధనం తదితర వివరాలపై చర్చించారు. ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో సభ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1200 మంది సభ్యులు సౌర విద్యుత్తు యూనిట్ల మంజూరుకు అర్హత కలిగి ఉన్నారు. వారిలో మొదటి విడత 385 యూనిట్లకు ఎంపిక చేయనున్నారు.
పథకానికి ఎంపికైన మండలాలు
ఖమ్మం: చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ, సత్తుపల్లి గ్రామీణం, ఖమ్మం గ్రామీణం, కొణిజర్ల మండలాలతో పాటు మెప్మాలో సత్తుపల్లి ప్రియదర్శిని, మధిర సరస్వతి, ఖమ్మంలోని కస్తూరి సంఘాలను ఎంపిక చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, గుండాల, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, పినపాక మండలాలను ఎంపిక చేశారు.
* ఒక్కో మండలంలో 35 యూనిట్లను మంజూరు చేయనున్నారు. మెప్మాలోనూ 35 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు.
ఉత్పత్తి ఇలా..
టీఎస్ రెడ్కో సహకారంతో గృహాలపై ఫైనాన్సింగ్ గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటికీ 2 నుంచి 3 కిలోవాట్ల పవర్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు 2 నుంచి 12 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సోలార్ విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు సబ్సిడీపై అందించే పరికరాలకు 25 ఏళ్లపాటు గ్యారెంటీ ఉంటుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును గృహ వినియోగానికి ఖర్చు చేయగా మిగిలింది గ్రిడ్కు విక్రయించవచ్చు. అందుకు యూనిట్కు రూ.4.20 ఇస్తారు.
సోలార్ విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకోసం వారికి అవగాహన కల్పిస్తాం. ఎంపిక చేసిన మండలాల్లో సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
ఎం.విద్యాచందన, డీఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
ఖమ్మం జిల్లా ఏన్కూర్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏన్కూర్లో ఆర్సీఎం చర్చి నుంచి ప్రార్థనలు చేస్తూ సిలువ మార్గంగా టీఎల్ పేట చర్చి వరకు చేరుకున్నారు. -
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు