పాలేరు దంగల్
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులకు భారాస సంకేతాలిస్తోంది. ఖమ్మం జిల్లాలో మాత్రం అధికార పార్టీ, వామపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.
పొత్తులా.. కత్తులా..?
ఈటీవీ- ఖమ్మం: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులకు భారాస సంకేతాలిస్తోంది. ఖమ్మం జిల్లాలో మాత్రం అధికార పార్టీ, వామపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలోనే తమకు పాలేరు నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యమని.. ఈసీటు కోసం ముఖ్యమంత్రితో గట్టిగా పట్టుబడతామని సీపీఎం ప్రకటించగా.. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారాస- వామపక్షాల పొత్తులపై ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక నాటి నుంచే వీటి మధ్య మిత్రబంధం ఏర్పడింది. ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు భారాస ముఖ్యనేతలు సంఘీభావం ప్రకటించారు. కూసుమంచిలో జనచైతన్య యాత్ర వేదికను ఎమ్మెల్యే కందాళ శుక్రవారం పంచుకున్నారు. ఈసందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ను గట్టిగా పట్టుబడతామన్నారు. ఒకవేళ భారాసకే సీటు కేటాయిస్తే.. తమ భుజాలపై పెట్టుకుని కందాళను గెలిపిస్తామని తెలిపారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి శనివారం దీటుగా స్పందించారు. కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని వ్యాఖ్యానించడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తానే పోటీచేసి గెలుస్తానన్నారు. పాలేరులో ‘వార్ వన్ సైడ్’ అని ప్రకటించడంతో రాజకీయంగా కాక పుట్టిస్తోంది.
చర్చనీయాంశం..
పాలేరు నియోజకవర్గం నుంచే బరిలో నిలుస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరులో పాలేరు నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. భారాస నుంచి ఈసారి టికెట్ తనదేనంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావంతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాళ ఉపేందర్రెడ్డి.. కాంగ్రెస్ నుంచి భారాసలో చేరారు. అధికార పార్టీలో టికెట్ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు సీపీఎం సైతం ఇక్కడ పోటీ చేస్తామనటం చర్చనీయాంశమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్