logo

భాజపాది నిరంకుశ పాలన: తమ్మినేని

రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే ఆయనపై అనర్హత వేటు వేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Published : 26 Mar 2023 03:39 IST

మాట్లాడుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావు. పక్కన తమ్మినేని, నున్నా, జూలకంటి తదితరులు

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే ఆయనపై అనర్హత వేటు వేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో భాజపా నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించారు. సీపీఎం ఆధ్వర్యంలో తలపెట్టిన జనచైతన్య యాత్ర శనివారం నేలకొండపల్లికి చేరుకుంది. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌పై వేటు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బండి రమేష్‌, నున్నా నాగేశ్వరరావు, కేవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆ పార్టీకి ఓటేసేవారే లేరు: ఎంపీ నామా

భాజపాకు ఇక్కడ ఓటేసేవారే లేరని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. నేలకొండపల్లిలో జనచైతన్య యాత్రకు సంఘీభావం ప్రకటించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని కోరినా కేంద్రం స్పందించడం లేదన్నారు. రాహుల్‌గాంధీ అనర్హతపై మాట్లాడేందుకు పార్లమెంటులో అవకాశమివ్వలేదని ఆరోపించారు. బ్రిటీషు కాలంలో కూడా ఇంత దారుణంగా పాలన లేదన్నారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. జడ్పీ ఉపాధ్యక్షురాలు మరికంఠి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని