ఎస్సై, కానిస్టేబుల్స్ అభ్యర్థులకు ముగిసిన ఉచిత శిక్షణ
వచ్చేనెలలో జరగనున్న ఎస్సై, కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రధాన రాత పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు వంద మంది అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెణ్నెల్లుగా నిర్వహిస్తున్న ఉచిత ఉచిత శిక్షణ శనివారం ముగిసింది.
ఎస్పీ వినీత్తో ఉచితంగా పుస్తకాలు పొందిన అభ్యర్థులు
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: వచ్చేనెలలో జరగనున్న ఎస్సై, కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రధాన రాత పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు వంద మంది అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెణ్నెల్లుగా నిర్వహిస్తున్న ఉచిత ఉచిత శిక్షణ శనివారం ముగిసింది. కొత్తగూడెం ఐఎంఏ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వినీత్ మాట్లాడుతూ పోలీసు శాఖలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైనప్పట్నుంచి అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రిలిమినరీలో 200 మందికి ఉచిత శిక్షణ ఇవ్వగా 170 మంది మెయిన్స్కి ఎంపికయ్యారన్నారు. ఈవెంట్్సల్ 270కి గాను 210 మంది అర్హత సాధించారన్నారు. ప్రధాన పరీక్షలకు 60 రోజుల శిక్షణ ఇచ్చామన్నారు. అశ్వారావుపేట, గుండాల తదితర దూరప్రాంతాల అభ్యర్థులైన 45 మందికి ఉచిత వసతి సదుపాయాన్నీ కల్పించి ప్రోత్సహించిన అధికారులను ఎస్పీ అభినందించారు. ఏప్రిల్ 9న ఎస్సై, 30న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు. తరగతుల నిర్వహణకు ముందుకొచ్చిన శ్రీమేధ స్టడీ సర్కిల్ ఛైర్మన్ శివప్రసాద్ను, అన్ని సదుపాయాలు కల్పించిన ఏఆర్ అడిషనల్ ఏసీపీ విజయ్బాబు, ఆర్.ఐ. నాగేశ్వరరావులను వినీత్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఆర్.ఐ. కామరాజు, సుధాకర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!