logo

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో చోటు చేసుకుంది.

Published : 27 Mar 2023 04:02 IST

ప్రభాస్‌

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రాజేశ్‌ కుమార్‌ కథనం ప్రకారం.. ఆంధ్రాలోని ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడేనికి చెందిన గుడిదల ప్రభాస్‌(21) పేరాయిగూడెంలో మేనమామ నార్లపాటి వెంకన్నబాబు ఇంటి వద్ద ఉంటూ పెయింటింగ్‌ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి వెల్లి పనులు చేసిన డబ్బులు తీసుకుని తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో ప్రభాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని మేనమామ నార్లపాటి వెంకన్నబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ దొంగరి హరికిషన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్‌కుమార్‌ తెలిపారు. కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతునికి తల్లితోపాటు ఆనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, చెల్లి ఉన్నారు. వారిని ప్రభాస్‌ పెయింటింగ్‌ పనిచేస్తూ పోషించేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని