పంట నష్టం అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం
ఖమ్మం జిల్లాలో పంట నష్టం సర్వేను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించారు
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: ఖమ్మం జిల్లాలో పంట నష్టం సర్వేను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)తో పాటు వీఆర్ఏ కలిసి దెబ్బతిన్న పొలాలను సర్వే చేసి అందుకు అనుగుణంగా రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. కౌలు రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే నంబరు ఆధారంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ఎంత మేరకు నష్టం జరిగిందనే విషయం గురించి రైతుల సమక్షంలోనే నమోదు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశానుసారం పంట నష్టం అర్హుల జాబితాలను గ్రామ పంచాయతీల్లో, రైతు వేదికల్లో ప్రదర్శిస్తారు. డీఏవో ఎం.విజయనిర్మల చింతకాని మండలంలోని మత్కేపల్లి, నాగులవంచ గ్రామాల్లో బుధవారం పర్యటించి పంట నష్టం నమోదు అంశాన్ని పరిశీలించారు. మధిర ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా పనిచేస్తున్నారనే విషయం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన అంశాలను వారికి వివరించారు,
సర్వేకు అదనపు సిబ్బంది...
జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన బోనకల్లు, చింతకాని, వైరా, కొణిజర్ల మండలాలకు అదనపు సిబ్బందిని కేటాయించారు. పంట నష్టం జరగని మండలాలకు చెందిన సుమారు 40 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను డిప్యుటేషన్పై నియమించారు. దీని వల్ల పంట నష్టం అర్హుల సర్వే త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి నివేదికను రాష్ట్ర వ్యవసాయశాఖకు నివేదించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున జమ చేస్తుంది.
రెండు రోజుల్లో భద్రాద్రి జిల్లాలో..
ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఉన్నతాధికారులంతా శ్రీరామనవమి వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ జిల్లాలోనూ పంట నష్టం అర్హుల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాతో పోలిస్తే ఈ జిల్లాలో పంట నష్టం తక్కువగానే ఉంది. సుమారు 3 వేల ఎకరాల్లో మాత్రమే దెబ్బతిన్నందున కొద్ది రోజుల్లోనే సర్వే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూచువారలకు చూడ ముచ్చట..
[ 18-04-2024]
కల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు. -
నేటి నుంచి నామినేషన్ల ఘట్టం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల క్రతువులో అత్యంత కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారం మొదలుకానుంది. మే 13న జరిగే పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శోకసంద్రంలో ముంచొద్దు..!
[ 18-04-2024]
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు యువత, చిన్నారులు ఈతకెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు చెరువులు, వాగులు, కుంటల్లో సైతం జలకాలాడుతున్నారు. -
నేడు సీతారాముల పట్టాభిషేకం
[ 18-04-2024]
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం మహాపట్టాభిషేకం జరగనుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
దర్గాలో దశరథ తనయుని కల్యాణం
[ 18-04-2024]
భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ నాగుల్మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్లో అర్చకుల వేదమంత్రాల నడుమ బుధవారం శ్రీరామ నవమి వేడుక కనుల పండువగా సాగింది. -
అందుబాటులో ‘అయోధ్య’ తపాలా బిళ్లలు
[ 18-04-2024]
అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన తపాలా బిళ్లలు ఖమ్మం స్టేషన్ రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. రామ మందిరానికి చెందిన ఆరు ప్రముఖ చిత్రాలతో ఆరు తపాలా బిళ్లలు ఉన్నాయి. -
తొట్టెలపాడు..
[ 18-04-2024]
మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి. -
వయసు మూడు.. ఈత చూడు!
[ 18-04-2024]
ఖమ్మం నగరంలోని పటేల్ స్టేడియం ఈత కొలనుల్లో 5 ఏళ్ల లోపు వారికోసం ప్రత్యేకమైన మినీపాండ్ ఉంది. కేవలం వేసవిలో మాత్రమే ఈ మినీపాండ్ అందుబాటులో ఉంటుంది. అడుగు లోతు ఉంటుంది. -
ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి
[ 18-04-2024]
పండుగ పూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... -
అత్తమామలు వేధిస్తున్నారని ఆందోళన
[ 18-04-2024]
భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్తింటివారు వేధిస్తూ, చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రచన అనే మహిళ బోనకల్లులోని తన మామ ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ