logo

మాజీ ఎమ్మెల్సీ పువ్వాడకు అస్వస్థత

సీపీఐ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు.

Published : 30 Mar 2023 05:07 IST

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: సీపీఐ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి శరీరంలో సోడియం మోతాదు తక్కువ కావడంతో నీరసంగా ఉన్న ఆయన్ని ఖమ్మం మమతా ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలందించారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన వెంట కుమారుడు, రవాణా మంత్రి అజయ్‌కుమార్‌, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఖమ్మం సీపీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని