బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడే
ఖమ్మం జిల్లా న్యాయవాద సంఘం(బార్ అసోసియేషన్) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి.
ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్టుడే: ఖమ్మం జిల్లా న్యాయవాద సంఘం(బార్ అసోసియేషన్) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రి 8 గంటలకల్లా తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి సోమశేఖరశర్మ తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్లో దాదాపు 1,100 మంది న్యాయవాదులు ఉండగా అందులో ఈసారి 884 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఓటర్లు తెలంగాణ బార్ కౌన్సిల్ లేదా ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు వెంట తీసుకువచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు ప్రకటించారు.
అధ్యక్ష బరిలో ఆరుగురు!
ఈసారి ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి బరిలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వ న్యాయవాది(జి.పి) దిరిశాల కృష్ణారావుతోపాటు రాజ్పుత్ సుధీర్సింగ్, నేరెళ్ల శ్రీనివాసరావు, చిలుకూరి స్వర్ణకుమారి, ఎంఏ.తౌఫీక్, మల్లెంపాటి అప్పారావు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శి పదవి కీలకమైంది. ఈసారి ఈ పదవికి ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగినా వ్యక్తిగత కారణాలతో ఒకరు మధ్యలోనే విరమించుకున్నారు. దీంతో మిగిలిన చింతనిప్పు వెంకటేశ్వర్లు, మన్నేపల్లి బస్వయ్య మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు మారింది. జాయింట్ సెక్రటరీ పదవికి అయ్యదేవర విజయరాఘవ, కండె వెంకటేశ్వర్లు పోటీ పడుతుండగా క్రీడలు-సాంస్కృతిక కార్యదర్శి పదవికి పెరుమాళ్లపల్లి జానయ్య, రావుల వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.
నాలుగు పదవులు ఏకగ్రీవం..
ఉపాధ్యక్షుడిగా మాదిరాజు లక్ష్మీనారాయణ, కోశాధికారిగా మిరియాల జ్యోతి ప్రవీణ్, లైబ్రరీ సెక్రటరీగా గాజుల అమరనాథ్, మహిళా ప్రతినిధిగా కె.వి.వి.లక్ష్మి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం ఈసీ సభ్యులను నియమిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా