పద్యపూరణల్లో రికార్డులు
తాము పాఠశాలల్లో బోధించిన సబ్జెక్టులు వేరైనా తెలుగుపై తరగని అభిమానం పెంచుకున్నారు. కవితలు, వ్యాసాలు రచించారు.
ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయుల ప్రత్యేకత
తాము పాఠశాలల్లో బోధించిన సబ్జెక్టులు వేరైనా తెలుగుపై తరగని అభిమానం పెంచుకున్నారు. కవితలు, వ్యాసాలు రచించారు. మాతృభాషలో పట్టుసాధించి పద్యపూరణల్లో ప్రత్యేకత చాటుతూ పురస్కారాలు పొందుతున్నారు. ఇటీవల వినూత్న పద్ధతిలో పద్యాలలో సమస్యా పూరణలు చేస్తూనే చెరో 108 సమస్యలు పద్య పాదాలుగా కూర్చుకుని వాటిని రెండు శతకాలుగా రాసి పద్య పఠనం చేశారు. దీంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను సొంతం చేసుకున్నారు సత్తుపల్లికి చెందిన ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులు ఆర్వి.రమణమూర్తి, పీవీఎస్ మల్లికార్జునరావులు.. సత్తుపల్లిలో ఇటీవల ఒకేరోజు ఇద్దరు ఆ పురస్కారాలు అందుకున్నారు.
సత్తుపల్లి, న్యూస్టుడే
రాయడం అభిరుచిగా ఆరంభమై..
పీవీఎస్ మల్లికార్జునరావు
రాయడం అభిరుచిగా ఆరంభమై అలవాటుగా మారిందని పీవీఎస్ మల్లికార్జునరావు అన్నారు. సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఆయన పద్య రచనతోపాటు కవితలు కూడా రాస్తుంటారు. సాహిత్య కవులు కన్నెగంటి వెంకటయ్య, సత్యనారాయణరెడ్డి, మధుసూదనరాజు, మడుపల్లి భద్రయ్యలు కవిత్వ రచనలో ప్రోత్సహించడంతో పద్య కవిత్వంలో మెలకువలు నేర్చుకున్నారు. రామిశెట్టి మాట అనే శతకాన్ని రచించి పుస్తకాన్ని విడుదల చేసిన ఆయన వినూత్న పద్ధతిలో పద్య పూరణలు చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను అందుకున్నారు. పద్య పూరణల శతక పుస్తకంతోపాటు మరికొన్ని కవిత్వాలు, చరణాల పుస్తకాలను త్వరలో ముద్రించనున్నట్లు మల్లికార్జునరావు తెలిపారు.
వచన కవితలతో మొదలై...
ఆర్.వి.రమణమూర్తి
వచన కవితలతో తన ప్రయాణం మొదలై రచనా వ్యాసంగం పద్య కవిని చేసిందని ఆర్.వి.రమణమూర్తి తెలిపారు. కిష్టారం ఉన్నత పాఠశాలలో పని చేస్తూ అక్కడే ఉద్యోగ విరమణ చేసిన తనకు తండ్రి కామేశ్వరరావు నుంచే మాతృ భాషాభిమానం సంక్రమించిందని చెప్పారు. హైదరాబాదులోని ఈనాడు జర్నలిజం స్కూల్లో అతిథి ఉపన్యాసకులుగా పని చేస్తున్న ప్రముఖ కవి ఎర్రాప్రగడ రామమూర్తి ప్రోత్సాహమే తనలో పద్య కవిత్వం వైపు మళ్లించిందని తెలిపారు. ‘తెలుగువెలుగు’ పుస్తకంలో సమస్యా పూరణ శీర్షికలో పద్యాలు రాసేలా ఆయన ప్రోత్సహించారన్నారు. తర్వాత రేడియోకు కూడా తాను పద్య పూరణలు పంపానని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పద్య, కవితా రచనలు చేస్తున్నా.. ఇటీవల సృజన సాహితీ సమాఖ్య ప్రోత్సాహంతో పద్య పూరణల శతక రచన పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహº్మత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్