ఆశలు అడియాసలేనా.. దాతలు స్పందిస్తారా..?
ఆశలు అడియాసలేనా..? దాతలు ఎవరైనా స్పందిస్తారా? అని ఎదురుచూస్తోందీ నిరుపేదల కుటుంబం.
మనోవేదనలో దివ్యాంగురాలి కుటుంబ సభ్యులు
తల్లి తిరుపతమ్మతో దివ్యాంగురాలు భవానీ
భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: ఆశలు అడియాసలేనా..? దాతలు ఎవరైనా స్పందిస్తారా? అని ఎదురుచూస్తోందీ నిరుపేదల కుటుంబం. కడు పేదరికంలో సైతం దాతల సహాయంతో ఎంతో కష్టపడి సాధించిన పరీక్ష ఫలితాలు రద్దవడంతో ఆ నిరుపేద దివ్యాంగులైన భవానీ ఎంతో ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న బాసిపోగు మల్లయ్య తిరపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భవానీ దివ్యాంగురాలు. వినికిడి శక్తితో పాటు మాటలు సరిగా రావు. తండ్రి మల్లయ్య కూలి పనులు చేస్తూ, తల్లి తిరుపతమ్మ ఇళ్లలో పనులు చేస్తూ, ఓ దాత దయతో అద్దె లేకుండా ఇచ్చిన ఇంట్లో వారు నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
* వీరి చిన్న కుమార్తె భవానీ దాతల చేయూతతో కష్టపడి చదివి గ్రూపు-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 60 శాతం దివ్యాంగురాలైన భవానీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఆ నిరుపేద కుటుంబం ఎంతో సంతోషానికి గురైంది. ఏదో ఒక ప్రభుత్వ కొలువు వస్తే తమ కష్టాలు తీరతాయని అంతా భావించారు. ఇటీవల పేపర్ లీకేజీ ఘటనలతో ప్రభుత్వం గ్రూపు-1 పరీక్షా ఫలితాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ నిరుపేద కుటుంబం కలలు కల్లలుగా మారిపోయాయి. అసలే అంతంత మాత్రంగా ఉండి పూటగడవని ఆ కుటుంబానికి కుమార్తె మళ్లీ మరో సారి పరీక్షలు రాయాలంటే ఆర్థిక భారమే. దీంతో భవానీ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని భావించిన తరుణంలో తమకు మళ్లీ దేవుడు ఇలాంటి అగ్ని పరీక్షపెట్టాడని వాపోతున్నారు. భవానీ పరీక్షలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సహకారం అందించాలని లేదా దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?