నువ్వు లేక నేనుండలేను.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి
మనుషులు వేరు మనసు ఒకటే.. పరిస్థితులు వేరు ప్రతిస్పందన ఒకటే.. బంధువులు వేరు కానీ బాంధవ్యం ఒక్కటే.
శ్యాంపురి భాస్కర్రావు, బాయమ్మ దంపతులు
మనుషులు వేరు మనసు ఒకటే.. పరిస్థితులు వేరు ప్రతిస్పందన ఒకటే.. బంధువులు వేరు కానీ బాంధవ్యం ఒక్కటే. ముఖం చూసినంతనే ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు అర్థం చేసుకోవటం.. మాటలో కరకుదనం పరిస్థితుల ప్రభావం అని తమాయించుకోవటం, అర్ధాంతర మౌనం ఒత్తిడి ప్రభావమని భావించటం, జీవించటం.. ఇవన్నీ ఆదర్శ దంపతుల లక్షణాలు. మూడు ముళ్ల బంధం మొదలవగానే భర్త/భార్య, పిల్లలు, కుటుంబాన్ని బంధంగా ఒకరు, బాధ్యతగా ఇంకొకరు జీవితాంతం వారు భావిస్తుంటారు. అన్ని విషయాల్లో ఈ ‘ఏకతా సూత్రం’ దూరం కావటమే ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతోంది. క్షణికావేశం, ‘నేను’ అనే చట్రంలో ఇరుక్కపోవటం, ఎదుటి వ్యక్తి బాధల్ని, భావావేశాల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోకపోవటం ఇలాంటివన్నీ ఇళ్లలో విభేదాల నెగళ్లు రగులుస్తున్నాయి.. తరచూ వెలుగుచూస్తున్న ఇలాంటి వార్తలకు భిన్నంగా పాల్వంచ మండలంలో ఎడబాటును తట్టుకోలేక దంపతులిద్దరూ 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన ఘటన వెలుగు చూసింది..
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన శ్యాంపురి భాస్కర్రావు(70), బాయమ్మ(60)లు నాలుగు దశాబ్దాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైనా వారిద్దరూ పెద్దలను ఎదిరించి ఒకటయ్యారు. ఆ బంధాన్ని ఆసాంతం సాగించారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండవారు కాదు. ఎక్కడికెళ్లాలన్నా కలిసే వెళ్లేవారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. మనవళ్లు, మనవరాళ్లూ ఉన్నారు. కేటీపీఎస్లో పనిచేసిన భాస్కర్రావు ఉద్యోగ విరమణ అనంతరం పట్టణంలోని నవభారత్లో ఇల్లు నిర్మించుకున్నారు. కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న వృద్ధ దంపతులిద్దరూ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. వారి అన్యోన్యతను చూడలేని విధికి కన్నుకుట్టిందో ఏమో.. గుండెపోటు రూపాన భార్యాభర్తలిద్దరూ మృత్యుఒడికి చేరారు. శుక్రవారం సాయంత్రం భాస్కర్రావుకు పక్షవాతం లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత అదేరోజు రాత్రి ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మళ్లీ గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. చనిపోయే ముందు భార్యను చూడడానికి తాపత్రయపడ్డాడని, కుటుంబ సభ్యులు తెలిపారు.
అన్నపానీయాలు మాని..
భర్త ఎడబాటును తట్టుకోలేని బాయమ్మ రోజంతా విలపించింది. తీవ్రంగా కుంగిపోయింది. మానసిక బాధతో శనివారం అర్ధరాత్రి 1.30 గంటల గుండెపోటుతో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులు అనంతలోకాలకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ వృద్ధ దంపతుల అన్యోన్యత తెలిసిన పలువురు కన్నీరుమున్నీరయ్యారు.
పాల్వంచ గ్రామీణం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
[ 16-04-2024]
భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. -
సీఎస్ శాంతాకుమారికి ఘనస్వాగతం
[ 16-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ విశ్రాంతి భవనానికి మంగళవారం వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. -
మామూలు రాళ్లు కాదు.. రామాయణ ఆనవాళ్లు!
[ 16-04-2024]
లక్ష్మణ గుట్ట. సీతారాములవారు సంచరించిన ప్రాంతమిది. లక్ష్మణుడు పహారా కాసిన ప్రదేశమని భక్తుల నమ్మిక. -
భక్తుల సేవే భగవంతుడి సేవ
[ 16-04-2024]
శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. -
కదన కుతూహలం
[ 16-04-2024]
సార్వత్రిక సమరంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమవుతోంది. నామినేషన్ల స్వీకరణ క్రతువు గురువారం మొదలుకానుంది. నామపత్రాల దాఖలుతో పాటు ప్రచార జోరు పెంచేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. -
నవమికి 238 ప్రత్యేక బస్సులు
[ 16-04-2024]
తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరగనున్న భద్రాచలం సీతారామ కల్యాణ మహోత్సవానికి(శ్రీరామ నవమి) హాజరు కానున్న భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 238 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రాంతీయ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. -
ఏళ్ల కల.. సాకారమైన వేళ
[ 16-04-2024]
ఒకప్పుడు భద్రాచలం దండకారణ్యం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు కాలినడకన, ఎడ్లబండ్లపై యాత్రికులు వచ్చేవారు. -
నీటి సంపులో పడి బాలుడి మృతి
[ 16-04-2024]
ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన వైరా మండలం సిరిపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... -
గెలిపిస్తే.. రాష్ట్ర గొంతుకగా నిలుస్తా: నామా
[ 16-04-2024]
లోక్సభలో భారాస పక్షనేతగా తెలంగాణ రాష్ట్ర గొంతుకను వినిపిస్తున్న తనను త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఒక్క అవకాశమివ్వండి సేవకుడిలా పనిచేస్తా: తాండ్ర
[ 16-04-2024]
ఖమ్మం ఎంపీగా ఒక్క అవకాశమిస్తే సేవకుడిగా పనిచేస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో సోమవారం ప్రచారం చేశారు. -
ప్రభుత్వ ఆస్తి ధ్వంసం కేసులో రెండేళ్ల జైలు
[ 16-04-2024]
తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో సిమెంట్ రోడ్డును ధ్వంసం చేసిన కేసులో నిందితుడు ఎలక వెంకటేశ్వర్లుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపిక నాగశ్రావ్య సోమవారం తీర్పు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్కు ఈసీ నోటీసులు
-
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
-
ఛత్తీస్గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్.. అమిత్ షా ఏమన్నారంటే!
-
సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది.. గీత దాటితే వేటే: ఈసీ
-
వైకాపా మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం.. అభ్యర్థుల్ని అప్రమత్తం చేసిన ఎన్డీయే
-
ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్’లో రెండో ర్యాంకు