442 గ్రామాలు.. 2,22,855 ఇళ్లు
స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా అధికారులు నూతన అంకానికి శ్రీకారం చుడుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.
చింతకాని మండలం సీతంపేటలో సర్వే చేస్తున్న బోనకల్లు ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, సిబ్బంది
వైరా, న్యూస్టుడే: స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా అధికారులు నూతన అంకానికి శ్రీకారం చుడుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. జూన్ మూడో వారం నాటికి సర్వే పూర్తి చేసి ప్రత్యేక పోర్టల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద నివేదించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
జంబ్లింగ్ పద్ధతిలో..
మండలాల వారీగా ఎంపిక చేసిన ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాల్లో జంబ్లింగ్ పద్ధతిలో సిబ్బందిని కేటాయించారు. దీని కోసం మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవో ఆధ్వర్యంలోని బృందంతో సర్వే చేయిస్తున్నారు. ఆయా బృందాలకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీల్లో పనిచేసే మల్టిపర్పస్ కార్మికులు చేదోడుగా నిలుస్తున్నారు. ఒక మండలం సిబ్బందిని మరో మండలంలో నియమించి సర్వే చేయిస్తున్నారు. ఉదాహరణకు బోనకల్లు మండల పరిషత్తు అధికారులు, కార్యదర్శులు ఇతర సిబ్బందిని చింతకాని మండలంలో సర్వే చేయిస్తుండగా వైరా మండలం ఎంపీడీవో బృందాన్ని కొణిజర్ల, ఖమ్మం రూరల్ మండలానికి నియమించారు. తల్లాడ మండల సిబ్బందిని ఏన్కూరు, ఖమ్మం రూరల్కు కేటాయించారు.
గత ఆగస్టులో మొదటి దఫా.. ఇప్పుడు రెండో దఫా
గతేడాది ఆగస్టులో ఎంపిక చేసిన 147 గ్రామ పంచాయతీల్లోని 75 వేల ఇళ్లలో మొదటి దఫా సర్వే పూర్తి చేశారు. తాజాగా రెండో దఫా సర్వేలో 442 గ్రామ పంచాయతీల్లోని 2,22,855 ఇళ్లల్లో ఆయా అంశాలపై సర్వే చేయనున్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. ఈ వేడుకల్లో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే కీలకంగా వ్యవహరించనున్నారు. ఒకేసారి దశాబ్ది ఉత్సవాలతో పాటు సర్వే చేయాల్సి రావడం భారంగా మారిందని మండల పరిషత్తు సిబ్బంది వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM