logo

బూత్‌ స్థాయిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి: పువ్వాళ్ల

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి బూత్‌ స్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ అన్నారు.

Updated : 02 Jun 2023 05:18 IST

మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌

కామేపల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి బూత్‌ స్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. శ్రేణుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్‌డీఎం(లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌) కార్యక్రమంలో భాగంగా ఇల్లెందు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం పాతలింగాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వకర్త సకిలం రాజేశ్వరరావు మాట్లాడుతూ... గ్రామస్థాయిలో చురుకైన కార్యకర్తలను గుర్తించి పార్టీ అనుబంధ సంఘాలలో భాగస్వాములను చేయటమే ఎల్‌డీఎం లక్ష్యమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారమే లక్ష్యంగా ఐక్యంగా కష్టపడాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎస్సీ, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బొందయ్య, వీరభద్రం, జడ్పీటీసీ సభ్యుడు వెంకట ప్రవీణ్‌, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముసలయ్య, రామారావు, సైదులు, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, జగన్నాథరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని