logo

96 మందికి నియామక పత్రాల అందజేత

గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన పోస్టుల్లో భాగంగా జిల్లాలో హెల్త్‌ అసిస్టెంట్లు 54, ఫార్మసిస్టులు 23, ల్యాబ్‌ టెక్నీషియన్లు 19 మందికి డీఎంహెచ్‌ఓ డా.జేవీఎల్‌ శిరీష నియామక పత్రాలను గురువారం అందజేశారు.

Published : 02 Jun 2023 04:08 IST

అందజేస్తున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జేవీఎల్‌.శిరీష

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన పోస్టుల్లో భాగంగా జిల్లాలో హెల్త్‌ అసిస్టెంట్లు 54, ఫార్మసిస్టులు 23, ల్యాబ్‌ టెక్నీషియన్లు 19 మందికి డీఎంహెచ్‌ఓ డా.జేవీఎల్‌ శిరీష నియామక పత్రాలను గురువారం అందజేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయా ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.సుకృత, ప్రోగ్రాంల అధికారులు బాలాజీ, పర్ష్యా నాయక్‌, చైతన్య, మణికంఠారెడ్డి, డిప్యూటీ డెమో ఎండి.ఫయాజ్‌మోహియుద్దీన్‌, ఏవో మోహన్‌, సూపరింటెండెంట్ సింగోజి, రామకృష్ణ, టి.విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని