రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల ఏర్పాట్ల పరిశీలన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టరేట్ ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్ అనుదీప్ గురువారం పరిశీలించారు.
కలెక్టరేట్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అనుదీప్, అధికారులు
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టరేట్ ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్ అనుదీప్ గురువారం పరిశీలించారు. శుక్రవారం ప్రారంభ వేడుకలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం కలెక్టరేట్కు చేరుకొని.. 9 గంటలకు జాతీయ పతాకం ఎగురవేస్తారన్నారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక సమర్పిస్తారన్నారు. డీఆర్వో అశోక చక్రవర్తి, ఏఓ గన్యా, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత పాల్గొన్నారు.
రైతు వేదికల్లో పండుగ వాతావరణం ఉట్టిపడాలి
కొత్తగూడెం కలెక్టరేట్: రైతు వేదికలను మామిడి తోరణాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించాలని, పండుగ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. రైతు దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక దిగుబడులు సాధించిన రైతులను సన్మానించేందుకు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సామూహిక భోజనాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్ 8న జరిగే ‘ఊరూరా చెరువుల పండగ’ ఏర్పాట్ల గురించి జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు బతుకమ్మలతో వస్తారని, నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 4న జిల్లాలోని సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. దశాబ్ది వేడుకల్లో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు
కొత్తగూడెం కలెక్టరేట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తిచేసుకున్న దురిశెట్టి అనుదీప్నకు కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో అశోక చక్రవర్తి, ఏఓ గన్యా, ఎన్నిక విభాగం పర్యవేక్షకులు సురేష్, కలెక్టరేట్ అధికారులు శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది