ప్రయోగం ఫలించేనా...?
ఇంటర్ విద్యార్థులకు రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంటర్ విద్యార్థులకు రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు సైన్స్, వృత్తి విద్యాకోర్సుల సబ్జెక్టులకే పరిమితమైన ప్రయోగాలు తొలిసారిగా ఆంగ్లం సబ్జెక్టులోనూ అమలుచేయాలని భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష(తెలుగు)కే విద్యార్థులు ప్రాధాన్యమిస్తుండటంతో డిగ్రీలు, పీజీలు, వృత్తి విద్యాకోర్సులు అభ్యసించిన వారు సైతం ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించలేకపోతున్నారనే వాదనలున్నాయి. విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేందుకు ప్రాక్టికల్స్ దోహదపడతాయని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందేనా..?
90వ దశకానికి ముందున్న బోధన పద్ధతులు ఇప్పుడు లేకపోవటంతో భాషా సామర్థ్యాలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. తెలుగులో వర్ణమాలతో ప్రారంభించటం మొదలుకొని వాక్యనిర్మాణం వరకు సులభమైన బోధన పద్ధతులు అనుసరించేవారు. ఆంగ్లంలోనూ తొలుత ఏబీసీడీలను నేర్పి పదోతరగతి దాకా వ్యాకరణం, వాక్యనిర్మాణంపై తర్ఫీదు ఇచ్చేవారు. ఈ విధానానికి స్వస్తి పలికి నేరుగా వాక్యనిర్మాణంపై దృష్టిపెట్టటం విద్యార్థుల్లో అయోమయాన్ని సృష్టించింది. కొవిడ్ సమయంలో ఆన్లైన్ చదువులు మరింత గందరగోళానికి గురిచేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో పదోతరగతి వరకు కనీస ఆంగ్ల పరిజ్ఞానంతో చదివే విద్యార్థులు.. ఇంటర్లో పట్టణ ప్రాంత విద్యార్థులతో ప్రాక్టికల్స్లో పోటీపడటం ఇబ్బందికరంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2015 నుంచి ప్రయోగ పరికరాలు సరఫరా కావటం లేదని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సైన్స్, ఒకేషనల్ ప్రయోగాలే సరిగ్గా జరగటం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.
పరిశీలకులను ప్రసన్నం చేసుకుంటేనే..
ఇంటర్ ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. విద్యార్థులు భాషపై పట్టు సాధించేందుకు తరగతి గదుల్లో ఎక్కువ సాధన చేయించాలి. ఇంటర్ ప్రారంభం నుంచే ఈవిషయంపై తర్ఫీదు ఇవ్వటం మంచిది. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రయోగ పరీక్షలు ఉపయోగపడతాయి.
కేఎస్ రామారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం
ఇంటర్ ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. విద్యార్థులు భాషపై పట్టు సాధించేందుకు తరగతి గదుల్లో ఎక్కువ సాధన చేయించాలి. ఇంటర్ ప్రారంభం నుంచే ఈవిషయంపై తర్ఫీదు ఇవ్వటం మంచిది. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రయోగ పరీక్షలు ఉపయోగపడతాయి.
కేఎస్ రామారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?