కష్టానికి విజయం దాసోహం
‘మహారాష్ట్రలోని షోలాపూర్కు వంద కిలోమీటర్ల దూరంలో మిరే గ్రామం మాది... జనాభా 900 మంది. నేను అక్కడే పుట్టి పెరిగా. పాఠశాల మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలోని ఆమ్లస్లో ఉండేది.
భారత మహిళా క్రికెటర్ కిరణ్ప్రభు నవ్గిరె
‘మహారాష్ట్రలోని షోలాపూర్కు వంద కిలోమీటర్ల దూరంలో మిరే గ్రామం మాది... జనాభా 900 మంది. నేను అక్కడే పుట్టి పెరిగా. పాఠశాల మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలోని ఆమ్లస్లో ఉండేది. చదువు కోసం రోజూ రానూపోనూ 20 కిలో మీటర్లు సైకిల్పై ప్రయాణించాను. శ్రమించడం చిన్నతనం నుంచే అలవాటైంది. శ్రమ, సాధనలే నన్ను భారత క్రికెట్ జట్టులో నిలబెట్టాయి’ అని మహిళా క్రికెటర్ కిరణ్ ప్రభు నవ్గిరె చెప్పారు. ఖమ్మంలో జరుగుతున్న టీ-20 మహిళా క్రికెటర్ల ఆహ్వానం మేరకు ఖమ్మం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘న్యూస్టుడే’తో శుక్రవారం కాసేపు ముచ్చటించింది. ఆ వివరాలు మీ కోసం..
న్యూస్టుడే: పలు అంతర్జాతీయ మ్యాచులు, ముఖ్యంగా ఆసియా కప్లో మన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఓపెనర్, ఆల్ రౌండర్గా పేరుంది. మీ క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైంది?
కిరణ్: మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఏ అవసరం వచ్చినా 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పాఠశాల దశ నుంచి ఆరేళ్ల కిందటి వరకు నేను ఓ అథ్లెట్ను.. జాతీయ పతకాలు సాధించా. నన్ను అంతర్జాతీయ అథ్లెట్గా చూడాలన్నది నా తండ్రి కల. అందుకు దగ్గరగానే వచ్చాను. మా అమ్మ నన్ను క్రికెట్ వైపు ఎందుకు వెళ్లకూడదు.. ఇటీవల నువ్వు సరదాగా ఆడిన మ్యాచుల్లో బాగా ప్రతిభ చూపించావని ప్రోత్సహించింది. శిక్షణ కోసం పుణే వచ్చా. తర్వాత మ్యాచులు ఆడా. అప్పుడే నాగాలాండ్లో మహిళా క్రికెటర్ కావాలనే ప్రకటన చూసి అక్కడికి వెళ్లాను. మొదటి మ్యాచ్లోనే 160 పరుగులు చేశాను. ఆ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో అదే రికార్డ్ అయింది. అక్కడి ప్రదర్శన బీసీసీఐ దృష్టికి వెళ్లింది. ఆనాటి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు.
న్యూ: క్రికెట్ శిక్షణ ఎలా ఉంటుంది. క్రీడాకారుల ఆహారపు నియమాలు చెప్పండి.
కిరణ్:ఉదయం 4 గంటల నుంచి సెషన్ ప్రారంభం అవుతుంది. ముందుగా గంటన్నర యోగా, తర్వాత ధ్యానం చేయాలి. కొద్ది విరామం తర్వాత మైదానంలో కసరత్తులు ఉంటాయి. ట్రైనర్ సమక్షంలో 3 గంటలు సాధన చేస్తాం. అల్పాహారంలో ఉడికించిన గుడ్లు, ఇడ్లీ, బ్రెడ్, సలాడ్స్, పాలు ఉంటాయి. మధ్యాహ్న విరామం తర్వాత భోజనంలో ఉడకబెట్టిన చికెన్, పప్పు, ఆకుకూరలు, అన్నం, రొట్టెలు, సాయంత్రం జ్యూస్, బిస్కెట్లు, రాత్రికి ఇవే ఉంటాయి. నేను మాత్రం జొన్నరొట్టెలు, పసుపు కలిపిన పాలు తీసుకున్నాను. సాయంత్రం 4 గంటల నుంచి నెట్స్లో సాధన చేయిస్తారు. మైదానంలో పరుగు సాధన ఉంటుంది.
న్యూ: నేటితరం యువత ఆర్థికంగా త్వరగా స్థిరపడేందుకు క్రికెట్ను ఎంచుకుంటున్నారు. మరి మీరు?
కిరణ్:డబ్బు ఒకటే కాదు పేరూ వస్తుంది. డబ్బు కోసం నేను క్రికెట్ను ఎంచుకోలేదు. నేను పడిన కష్టానికి క్రికెట్లో మంచి ఫలితం వచ్చింది. ఏదో మారుమూల గ్రామాల్లో సైకిల్పై తిరిగే నేను, ఖరీదైన బైకులు, కార్లు కొన్నాను. కొద్దిపాటి వ్యవసాయంపై ఆధారపడిన నా కుటుంబానికి ఇప్పుడక్కడ ఎంతో పేరు. ఇదంతా క్రికెట్ ఇచ్చిందే కదా.
న్యూ: బాలికలకు మీరు చెప్పే క్రికెట్ పాఠాలు ఏమైనా ఉన్నాయా?
కిరణ్:నేను ఒక్కటే చెబుతాను. శారీరక కష్టానికి అలవాటు పడండి. మేము బాలికలం, మహిళలం, సున్నితం, తెరచాటునే ఉంటాము అంటే మీ జీవితం తెరచాటునే ముగిసిపోతుంది. ముందుకు రండి. వచ్చిన వారికే విజయాలు వరిస్తాయి. నేను ఓ మైనార్టీ కళాశాలలో శిక్షణ ఇచ్చిన సందర్భంలో అక్కడి బాలికలు, మహిళలు హిజబ్ ధరించి క్రికెట్ ఆడేందుకు ముందుకు వచ్చారు. అంతెందుకు నేను పుట్టిన ఊరిలో ఇప్పుడు వందమంది బాలికలు మైదానాలకు వచ్చి సాధన చేస్తున్నారు. నా ప్రేరణతో మా ఊరు ఆలోచనే మారింది.
న్యూ: క్రికెట్లో రాణించాలంటే ముఖ్యంగా బాలికలు ఏ వయస్సులో సాధన మొదలుపెట్టాలి?
కిరణ్:ఏవయస్సులోనైనా సాధన మొదలు పెట్టొచ్చు. తమపై తమకు నమ్మకం ఉండాలి. నేను నా 20 ఏట క్రికెట్ సాధన మొదలుపెట్టా. చిన్ననాటి నుంచి శారీరక దృఢత్వం ఉంది. అది ఎంతో ఉపకరించింది. మూడేళ్ల వ్యవధిలో భారత జట్టులోకి వచ్చా. అంతకుముందు నాగాలాండ్, మహారాష్ట్ర, యూపీ ఐపీఎల్ జట్లకు ఆడాను. పీఈటీ కావాలనుకొని బీపీఈడీలో చేరాక అక్కడ క్రికెట్కు చేరవయ్యాను. మహారాష్ట్రలోని ఓ మైనార్టీ కళాశాలలో శిక్షకురాలిగా పనిచేశాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు