సూరీడు సుర్రు..మీటరు గిర్రు
కొత్తగూడెం పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి కె.సత్యనారాయణ గృహ కనెక్షన్ బిల్లు 2022, ఏప్రిల్లో రూ.855 వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో బిల్లు రూ.959కి పెరిగింది.
* కొత్తగూడెం పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి కె.సత్యనారాయణ గృహ కనెక్షన్ బిల్లు 2022, ఏప్రిల్లో రూ.855 వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో బిల్లు రూ.959కి పెరిగింది. 2022, మేలో రూ.1,035 బిల్లు రాగా.. ఈ ఏడాది మే నెలలో రూ.1,365 బిల్లు వచ్చింది. రోజంతా కూలర్లు, ఏసీ వినియోగించడంతో బిల్లు పెరిగిందని సదరు వినియోగదారుడు పేర్కొంటున్నారు.
* లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన ఎస్.పద్మావతి నివాస కనెక్షన్కు గత సంవత్సరం మేలో రూ.820, ఈ ఏడాది అదే నెలలో ఏకంగా రూ.2,523 బిల్లు వచ్చింది. వేడి, ఉక్కపోత తాళలేక మూడు బెడ్రూంలలో ఉన్న మూడు ఏసీలనూ వినియోగించక తప్పని పరిస్థితి వచ్చిందని.. దీంతో బిల్లు అధికంగా నమోదైనట్లు ఆమె తెలిపారు.
కొత్తగూడెం గ్రామీణం, కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే : ఉభయ జిల్లాల్లో భానుడు ఠారెత్తిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో నిలకడగా 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెంలో 11 చోట్ల 45కి పైగా జూలూరుపాడు, పాల్వంచ మండలంలోని యానంబైలు, సీతారామపట్నంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఈ నెల 3న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో శనివారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పగటి ఉష్ణోగ్రతల ప్రకారం ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ 45.9, సత్తుపల్లి 45.5, ముదిగొండ 45.4, తిరుమలాయపాలెం, మధిర, మధిర మండలం సిరిపురం, కామేపల్లి మండలం లింగాల 45.1, కొణిజర్ల మండలం పెద్దగోపతి 45.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రెడ్ జోన్ పరిధిలో చేరాయి. దీంతో వేడి, ఉక్కపోత ధాటికి గృహ విద్యుత్తు వినియోగం అంతకంతకూ పెరిగింది. మీటర్లు గిర్రుమంటుండగా, ఛార్జీలు మోతమోగిస్తున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వేసవి ఎండల ప్రభావం అధికంగా ఉంది. గ్రామాల్లో సైతం ఫ్యాన్లు, కూలర్లు నిరంతరం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఏసీ ఉపశమనం పొందుతున్నారు. వ్యాపారులు దుకాణాలను ఉదయం, సాయంత్రం చల్లటి వాతావరణం ఉన్నంతసేపే తెరిచే పరిస్థితి నెలకొంది. గత వారం పదిరోజులుగా భానుడి ప్రతాపం జనజీవనాన్ని హడలెత్తిస్తోంది. మరికొద్దిరోజులు ఎండల ప్రభావం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబతున్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడంతో పాటు, బయటకు వెళ్లిన సమయాల్లో వడదెబ్బకు గురవకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.