వనితా విజయం...స్ఫూర్తిదాయక పయనం
ఫుట్బాల్ క్రీడ... ఇప్పటి వరకు యువకులే ఆడలేక చతికిలబడుతున్నారు. ‘పూర్తిస్థాయి మైదానంలో ఆడలేక హ్యాండ్బాల్, వాలీబాల్ కోర్టుల్లో ఆడుకుంటున్నారు..’
రాష్ట్రస్థాయి పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన జట్టు
ఖమ్మం క్రీడలు, న్యూస్టుడే : ఫుట్బాల్ క్రీడ... ఇప్పటి వరకు యువకులే ఆడలేక చతికిలబడుతున్నారు. ‘పూర్తిస్థాయి మైదానంలో ఆడలేక హ్యాండ్బాల్, వాలీబాల్ కోర్టుల్లో ఆడుకుంటున్నారు..’ లాంటి వ్యంగ్యాస్త్రాలు ఫుట్బాల్ రంగం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ తరుణంలో జిల్లా మహిళా జట్టు ఏకంగా రాష్ట్ర ఛాంపియన్షిప్ సాధించింది. దీంతో సూటిపోటి మాటలు, విమర్శలకు గట్టి సమాధానం చెప్పినట్టైంది. ఆడితే మనం గెలవగలం అనే కొత్త పట్టుదల, స్ఫూర్తి ఫుట్బాల్ రంగంలోకి వచ్చింది. ఆ స్ఫూర్తి ప్రదాతలు జిల్లా మహిళా ఫుట్బాలర్లు కావడం విశేషం.
జిల్లా ఫుట్బాల్ రంగానికి ఘన చరిత్ర ఉంది. గడచిన కొన్ని దశాబ్దాల్లో క్రీడా రంగంలో వచ్చిన మార్పులతో ఫుట్బాల్ ఆదరణ కోల్పోయింది. పూర్వ వైభవం కోసం ఇప్పుడు జిల్లా సంఘం ఓ పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలో మహిళా జట్లు ఎదిగి వచ్చాయి. గతంలో మహిళా జట్టు అనగానే సీనియర్ విభాగానికే పరిమితమయ్యేది. రెండేళ్ల కాలంగా జూనియర్ జట్టు కూడా పోటీ పడే స్థాయికి చేరింది. సీనియర్ దశకు వచ్చే స్థాయిగల క్రీడాకారిణులు వివాహాలు చేసుకొని ఈ రంగానికి దూరం అవుతున్నారు. ఇలాంటి ఒడిదుడుకులు, అనేక సవాళ్ల మధ్య జిల్లా సీనియర్ మహిళా ఫుట్బాల్ జట్టు అందరి అంచనాలు తారుమారు చేస్తూ రాష్ట్రస్థాయి సీఎం కప్ను గెల్చుకొచ్చింది.
బంగారు పతకం..
జట్టు క్రీడాంశాల్లో బంగారు పతకం సాధించిన ఘనత జిల్లా మహిళా ఫుట్బాల్ జట్టుకే దక్కింది. జిల్లా నుంచి వివిధ క్రీడాంశాల్లో అనేక జట్లు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాయి. అన్ని క్వార్టర్స్, సెమీ ఫైనల్స్లో వెనుదిరిగాయి. ఎలాంటి హడావుడి, అంచనాలు లేకుండా వెళ్లిన ఫుట్బాల్ జట్టు సీఎం కప్ను సాధించింది. ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి 17 జట్లు పాల్గొన్నాయి. ఇందులో హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి బలమైన జట్లుగా పేరుగాంచాయి. వాటిని ఖంగు తినిపించి జిల్లా జట్టు టైటిల్ సాధించింది. ఒక్కో క్రీడాకారిణి రూ.6,230 నగదు పురస్కారాన్ని అందుకున్నారు.
బలమైన జట్టు
మహిళా జట్టులో ఐ.మాధురి, ఎం.కావ్య, కె.అలేఖ్య, టి.అఖిల, టి.శ్రీలక్ష్మి, బి.రోజ, ఎం.నవ్యశ్రీ, పి.కావ్య, టి.తేజ, కె.రేవతి, వి.సారిక, ఎం.కిరణ్మయి, సి.హెచ్.చైత్ర, టి.స్వప్న, పి.వీణ, బి.చరణి ఉన్నారు. ఇందులో ఏడుగురికి ఇప్పటికే ప్రతిష్ఠాత్మక సీనియర్ నేషనల్స్ పోటీలు ఆడిన అనుభవం ఉంది. జట్టును కూర్చి, ఆ జట్టును రాష్ట్ర పోటీలకు సిద్ధం చేయడంలో శిక్షకుడు ఆదర్శ్కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ విజయం ఇప్పటి వరకు ఫుట్బాల్ జట్లపై ఉన్న ఆలోచనలు, అంచనాలు మార్చాయి. జట్టు క్రీడాంశాలకు జట్టుగా గెలుపొందినప్పుడే అందులోని క్రీడాకారులకు గుర్తింపు ఉంటుంది. ఆ కీర్తి ప్రతిష్ఠలు ఇప్పుడు దక్కాయి. వీరు జిల్లాకే మంచి పేరు తీసుకొచ్చి ప్రశంసలు పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)