తెలిసినవాడే కాటేశాడు..
ఎనిమిదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఏదులాపురంలో మంగళవారం చోటుచేసుకుంది.
ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ అఘాయిత్యం
రోడ్డుపై ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబీకులు, మద్దతుదారులు
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: ఎనిమిదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఏదులాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లోని సంచార జాతులకు చెందిన ఓ కుటుంబం ఏదులాపురంలో రోడ్డు పక్కనే డేరాలు వేసుకొని గ్యాస్ స్టవ్లు మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు కొని ఇస్తానని చెప్పి అక్కడే డేరాలు వేసుకొని నివాసముంటున్న జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన బాలుడు(17) సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. కొంతకాలంగా ఒకే ప్రాంతంలో ఉంటుండటంతో తెలిసిన వ్యక్తే కదా అని బాలిక అతనితోపాటు వెళ్లింది. అతడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడగా బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి చేరింది. విషయం తల్లికి చెప్పడంతో బాలికను చికిత్స నిమిత్తం ఖమ్మం సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.
సర్వజనాసుపత్రి ఎదుట ఆందోళన
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే: అత్యవసర స్థితిలో ఆస్పత్రికి వస్తే వైద్యులు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన బాట పట్టారు. ఏదులాపురంలో అత్యాచారానికి గురైన బాలికను తల్లిదండ్రులు ఖమ్మం సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిని సంప్రదించగా పోలీసులు రాకుండా తాము చికిత్స అందించలేమని నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద రోడ్డుపై బైఠాయించారు. రహదారిపై వెళ్లే వాహనదారులు వారికి మద్దతుగా నిలవడంతో ఆందోళన పెద్దదైంది. బాలికకు రక్తస్రావం జరుగుతున్నా వైద్యులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా మానవత్వం చాటకుండా వైద్యులు నిబంధనల పేరుతో బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. తర్వాత పోలీసులు వచ్చి బాధితులను సముదాయించి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. ఆర్ఎంవో డాక్టర్ అమర్సింగ్ పర్యవేక్షణలో బాలికకు వైద్యులు చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆస్పత్రిలో ఓ ప్రత్యేక గదిలో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. ఛైల్డ్ వెల్ఫెర్ కమిటీ బాధ్యులు బాలికను పరామర్శించి ఘటనపై వివరాలు సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
[ 24-04-2024]
బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్