logo

15న ఖమ్మానికి అమిత్‌ షా రాక

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈనెల 15న ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మంగళవారం తెలిపారు.

Published : 07 Jun 2023 03:51 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈనెల 15న ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మంగళవారం తెలిపారు. భాజపా అగ్ర నాయకత్వం ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖమ్మం నగరానికి శుక్రవారం వస్తారని తెలిపారు. కేంద్ర మంత్రుల పర్యటన పూర్తి    వివరాలు ఆయన వెల్లడిస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని