logo

నేడు మంత్రి సమీక్ష సమావేశం

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న మెడికల్‌ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలతో మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష జరుపుతారని  డీఎంహెచ్‌ఓ జేవీఎల్‌ శిరీష తెలిపారు.

Published : 07 Jun 2023 03:51 IST

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న మెడికల్‌ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలతో మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష జరుపుతారని  డీఎంహెచ్‌ఓ జేవీఎల్‌ శిరీష తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే సమావేశానికి వైద్యాధికారులు హాజరుకావాలని సూచించారు. మంగళవారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఎంఎల్‌హెచ్‌పీలు, మెడికల్‌ ఆఫీసర్లు ఎవరూ సమావేశానికి గైర్హాజరు కావద్దని స్పష్టం చేశారు. హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్లలో కొనసాగుతున్న సేవలపై జరిగే సమీక్షకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని