బ్యాగులతో ఆలయ ప్రవేశం నిషిద్ధం
భద్రాచల రామాలయం భద్రతను సవాల్ చేసే ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలకు ఈఓ రమాదేవి శ్రీకారం చుట్టారు.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచల రామాలయం భద్రతను సవాల్ చేసే ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలకు ఈఓ రమాదేవి శ్రీకారం చుట్టారు. ఇటీవల అధికారులకు తెలియకుండానే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వర్తించారు. అనుమతి లేకుండా వీరికి ఎస్పీఎఫ్ బృందం హాజరు వేసి విధులు కేటాయించారు. ఈ వివాదం పోలీసుల వరకూ చేరింది. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మండపం వద్ద ఒకరు స్వామివారి వస్త్రాలను కాజేసి విచారణ తర్వాత వారం క్రితం అప్పగించారు. 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంగా పట్టు వస్త్రాలను భక్తులు సమర్పించారు. ఇందులో ఓ దాత ఇచ్చిన రూ.లక్ష విలువైన చీరలు, పంచెలు, కండువాలు మాయమయ్యాయి. భద్రత నిమిత్తం సీసీ కెమెరా వ్యవస్థ, సెక్యూరిటీ గార్డులు, హోం గార్డులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నప్పటికీ డొల్లతనం బట్టబయలైంది. ఈ అంశంపై ఈఓ ఇటీవల సుదీర్ఘ సమీక్షలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భద్రత కోసం.. భక్తులను పెద్ద బ్యాగులతో దర్శనానికి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఈ అంశంపై భక్తులతో మర్యాదగా వ్యవహరించి వారికి అవగాహన కల్పించాలని ఈనెల 4న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. పెద్దసంచులు ఉంటే కౌంటర్లలో లేదా వసతిగదుల్లోగానీ భద్రపరిచేలా సెక్యూటిరీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ నిబంధన ఆలయ కార్యాలయ సిబ్బందితో పాటు వైదిక ఉద్యోగులకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. మతపరమైన సిబ్బంది తమకు అవసరమైన పారాయణం వంటి పుస్తకాలను తీసుకురావాలనుకుంటే తగిన చిన్నబ్యాగులకు అనుమతి ఉంటుందని, పెద్ద సంచులకు అవకాశం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో ఆలయానికి చెందిన వస్తువులు ఉన్నట్లు అనుమానం కలిగితే తనిఖీ చేసి తనకు సమాచారం ఇవ్వాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కోవెల వద్ద సెల్ఫోన్ ఉపయోగించవద్దనే ఉత్తర్వులు ఇప్పటికే ఉన్నాయి. ఇదంతా భద్రత కోసమేనని, అందరూ సహకరించాలని ఈఓ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జీఎం
[ 25-04-2024]
ఇల్లందు ఏరియా సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియం (24 ఏరియా)లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. -
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM