పాత నేరస్థులపై ప్రత్యేక దృష్టి
వానాకాలం పంటల సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది.
నకిలీల నిరోధానికి ‘టాస్క్ఫోర్స్’ వ్యూహం
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే
ఖమ్మంలో విత్తన దుకాణంలో అధికారుల తనిఖీ (పాత చిత్రం)
వానాకాలం పంటల సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏటా ఖమ్మం జిల్లాలో సుమారు రూ.60 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.40 కోట్ల పత్తి విత్తన వ్యాపారం జరుగుతోంది. అక్రమార్కులు ఉభయ జిల్లాలపై కన్నేశారు. ఏటా సీజన్కు ముందు ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాలకు నకిలీల విత్తనాలను తరలిస్తారు. అసలు విత్తనాలుగా నమ్మించి అనుమతి లేనివి విక్రయిస్తారు. అనుమానం రాకుండా వారికి పనికిరాని రసీదులు ఇస్తారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు రాక చాలామంది కర్షకులు నష్టపోతున్నారు.
గతంలో కేసులు ఇలా...
* 2016లో జిల్లాలో పెద్ద ఎత్తున జీవా కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఖమ్మంలో ముగ్గురిపై, వైరాలో ఒకరిపై వ్యవసాయశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
* 2021లో ఏన్కూరులో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకుని టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
గిరిజన మండలాలపై అక్రమార్కుల కన్ను...
అక్రమ వ్యాపారులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రధానంగా గిరిజన మండలాలపై దృష్టి సారించి అమాయక రైతులకు మాయమాటలు చెప్పి విత్తనాలు అంటగడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, సుజాతనగర్, చంద్రుగొండ, భద్రాచలం ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అధిక దిగుబడులు వస్తాయని చెప్పి గ్రామాల్లోకి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. నిరక్షరాస్యులైన గిరిజనులు అందమైన లేబుళ్లు చూసి కొనుగోలు చేసి మోసపోతున్నారు.
చెక్పోస్టుల వద్ద నిఘా..
తాజాగా రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారులు ఖమ్మం నగరంతో పాటు ఏన్కూరు, వైరా, తల్లాడ తదితర మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్థులే నకిలీ విత్తనాలను మళ్లీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గతంలో వివిధ విత్తన కంపెనీల్లో పని చేసి ఉద్యోగం మానేసిన, నకిలీ విత్తనాలు అమ్మి దుకాణాలు మూసివేసిన, భారీగా సంపాదించి కేసుల్లో ఇరుక్కున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు పెద్దమొత్తంలో ఉభయ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘా పెంచారు.
ట్రాన్స్పోర్టు కంపెనీలపై...
నకిలీ కేటుగాళ్లు రకరకాల పద్ధతుల్లో విత్తనాలను రహస్యంగా గ్రామాలకు తరలిస్తున్నారు. పోలీసులు, వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్ సిబ్బంది కన్నుగప్పి రహస్యంగా తరలిస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పుడు వివిధ రకాల ట్రాన్స్పోర్టు కంపెనీలైన నవత, ఎస్ఆర్ఎంటీ, టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు, తదితర రవాణా సంస్థలపై విజిలెన్స్శాఖ అధికారులు ఓ కన్నేశారు. ఈ సంస్థల ద్వారా అక్రమార్కులు నకిలీ విత్తనాలను తెప్పించే అవకాశం ఉందని భావించి వాటిపై కూడా నిఘా పెట్టారు. ఆన్లైన్లో అక్రమ వ్యాపారం నిర్వహించే సంస్థలపైనా అధికారులు దృష్టి సారించి నకిలీ విత్తనాలను ఎలాగైనా అడ్డుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్