పూర్తి స్థాయిలో పుస్తకాలు అందేనా..?
మరో మూడు రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సర్కారు బడుల్లో అభ్యసించే బాలబాలికలకు పాఠ్యపుస్తకాలను అధికారులు అందజేయనున్నారు. యూడైస్ ప్లస్ ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలు ఇంకా జిల్లా కేంద్రాల గోదాములకు చేరలేదు.
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్టుడే
కొత్తగూడెంలోని గోదాము నుంచి మండల కేంద్రాలకు తరలించే పుస్తకాలను లోడింగ్ చేస్తున్న హమాలీలు
మరో మూడు రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సర్కారు బడుల్లో అభ్యసించే బాలబాలికలకు పాఠ్యపుస్తకాలను అధికారులు అందజేయనున్నారు. యూడైస్ ప్లస్ ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలు ఇంకా జిల్లా కేంద్రాల గోదాములకు చేరలేదు. ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలను జిల్లా కేంద్రాల నుంచి ఆయా మండలాలకు అధికారులు పంపిణీ చేశారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులందరికీ పుస్తకాలు అందాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేసినా కొంతమంది బాలబాలికలకు పుస్తకాలు సరిపోకపోవచ్చు. వీరంతా అరకొర పాఠ్యపుస్తకాలతో విద్యాలయాలకు వచ్చే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య భారీగా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బడిబాటలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకూ పాఠ్యపుస్తకాలు అందజేయాల్సి ఉంటుంది.
ఉభయ జిల్లాల్లో..
రాబోయే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచి తొమ్మిదోతరగతి వరకు తెలుగు/ఆంగ్లమాధ్యమ బోధన అమలుకాబోతున్న విషయం విదితమే. గతేడాది ముద్రణ, సరఫరాలో జాప్యంతో నవంబరు వరకు కొందరు విద్యార్థులకు పుస్తకాలు అందలేదు. నలుగురైదుగురు కలిసి చదువుకున్నారు. ఈసారి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఆంగ్లమాధ్యమానికి సంబంధించి గణితం (ఒకటో తరగతి), తెలుగుమాధ్యమానికి సంబంధించి సైన్స్ (ఆరో తరగతి), తెలుగు, ఉర్దూ (ఏడో తరగతి) పుస్తకాలు రాలేదు. ఇంగ్లిష్ (రెండో తరగతి), ఇంగ్లిష్ (నాలుగో తరగతి) పాఠ్యపుస్తకాలు అందలేదు. భద్రాద్రి జిల్లాలో తెలుగు మాధ్యమానికి సంబంధించి తెలుగు (రెండో తరగతి), తెలుగువాచకం(ఆరో తరగతి) పుస్తకాలు రాలేదు. నాలుగో తరగతి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు అందలేదు. మరోవైపు జిల్లా కేంద్రంలోని గోదాముల నుంచి పాఠ్యపుస్తకాలను మండలాలకు తరలించేందుకు రవాణా ఛార్జీలు ఏళ్లుగా మంజూరు కావటం లేదు. ఆయా మండలాల అధికారులే ఖర్చులను సొంతంగా భరిస్తున్నారు.
ప్రస్తుతం 80 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. వీటిని మండల కేంద్రాలకు పంపిణీ చేశాం. అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా అవుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతికి పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుక్బ్యాంక్ నుంచి కావాల్సిన పుస్తకాలు ఇస్తాం.
సోమశేఖర్శర్మ, డీఈఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం