దయచేసి వినండి.. దొంగలతో జాగ్రత్త!
ప్రకాశం జిల్లాకు చెందిన నాగమణి మార్చి 20న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్కు బయలుదేరారు. రైలులో నిద్రిస్తున్న ఆమె చరవాణిని ఎవరో దొంగిలించారు.
రైళ్లలో పెరుగుతున్న చోరీలు
ప్రకాశం జిల్లాకు చెందిన నాగమణి మార్చి 20న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్కు బయలుదేరారు. రైలులో నిద్రిస్తున్న ఆమె చరవాణిని ఎవరో దొంగిలించారు. ఖమ్మంలో చూసుకునేసరికి చరవాణి లేదు. ఖమ్మం రైల్వేస్టేషన్లో దిగి జీఆర్పీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఆమె చరవాణి దొరకలేదు.
విజయవాడ మధురానగర్కు చెందిన నితిన్ రవితేజ ఫిబ్రవరి 29న మచిలీపట్నం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ వెళ్లారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు అతని రూ.70 వేల విలువ చేసే చరవాణిని దొంగిలించారు. ఖమ్మం వచ్చే సరికి చూసుకోగా చరవాణి కన్పించలేదు. ఖమ్మం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పట¨కీ చరవాణీని కనిపెట్టలేకపోయారు.
ఇలాంటి సంఘటనలు రైళ్లలో నిత్యకృత్యంగా మారాయి. వేసవిలో రైళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పిల్లలకు సెలవులు కావడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సుదూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే వారూ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏటా వీటి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జీఆర్పీ ఉన్నతాధికారులు దొంగతనాల నియంత్రణకు నడుం బిగించారు. ఏప్రిల్ మొదట వారం నుంచి జూన్ చివరి వారం వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రతిరోజూ రైళ్లలో ఎస్సై స్థాయి అధికారితో పాటు ప్రత్యేక సిబబందితో పెట్రºలింగ్ చేపడుతున్నారు.
మూడు జిల్లాల ప్రత్యేక సిబబంది
రైళ్లలో చోరీల నియంత్రణకు ఖమ్మం జీఆర్పీతో పాటు కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ప్రత్యేక సిబబందితో గస్తీ నిర్వహిస్తున్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్ పరిసరాలతో పాటు రైళ్లలో రాత్రి గసీˆ్త కాస్తున్నారు. మూడు జిల్లాల నుంచి 17 మంది కానిసేబల్స్తో పాటు మరో ఐదుగురు సిబబందిని కేటాయించగా.. రైళ్లలో ప్రతిరోజూ విధులు నిర్వర్తిస్తున్నారు. సింహపురి, చార్మినార్, బీదర్, మచిలీపట్నం రైళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నట్లు గుర్తించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైల్వేస్టేషన్లలో, రైళ్ల లోపల తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికులకు దొంగతనాలు/జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
చరవాణీలే ఎక్కువ...
చోరీల్లో చరవాణీలే ఎక్కువ చోరీకి గురవుతున్నాయి. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో, ఛార్జింగ్ పెట¨్ట పక్కకు వెళ్లిన సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. బగారు ఆభరణాలు, ఖరీదైన మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. దొంగలు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉండటంతో రికవరీ సవాలుగా మారుతోంది.
ప్రత్యేక బృందాలతో గస్తీ...
అంతోటి వెంకటేశ్వరరావు, సీఐ, ఖమ్మం జీఆర్పీ
రైళ్లలో దొంగతనాల నియంత్రణకు ఖమ్మం-విజయవాడ మధ్యలో ప్రత్యేక బదాలతో గస్తీ చేపడుతున్నాం. ఖమ్మం-విజయవాడ నడుమ ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ స్టేషన్ల మధ్య ప్రత్యేక బదాలతో పర్యవేక్షణ పెంచాం. ప్రయాణికుల భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ