మహిళా హక్కుల రక్షణకు ఉద్యమించాలి
మహిళా హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు.
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే: మహిళా హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్లో జోనల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా మల్లు లక్ష్మి హాజరై మాట్లాడారు. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. 2014 నుంచి భాజపా నిత్యావసర సరకుల ధరలను పెంచి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, అనేక మంది మహిళలు పోషక పదార్థాలు తీసుకోవడం కష్టంగా మారడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుగ్గవీటి సరళ ప్రిన్సిపల్గా వ్యవహరించగా.. ‘తెలంగాణ ప్రజా పోరాటం, మహిళల పాత్ర’ అనే అంశాన్ని బత్తుల హైమావతి బోధించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, రాష్ట్ర నాయకులు పాలడుగు ప్రభావతి, రత్నమాల, ప్రమీల, శ్రీలక్ష్మీ, అఫ్రోజ్ సమీనా, రమణ, నాగసులోచన, మెహరున్నీసాబేగం, కృష్ణవేణి, బాగం అజిత, సీతాలక్ష్మీ, కవిత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం