విజిటింగ్ వీసాలతో దళారుల మోసం
వారంతా నిరుపేదలు. విదేశాలకు వెళ్లి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చునని ఆశపడ్డారు. దళారులను ఆశ్రయించి అధికంగా నగదు చెల్లించి సింగపూర్ వెళ్లారు.
సింగపూర్లో ఇబ్బందులు పడుతున్న ఎర్రుపాలెం మండల వాసులు
ఎర్రుపాలెం: వారంతా నిరుపేదలు. విదేశాలకు వెళ్లి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చునని ఆశపడ్డారు. దళారులను ఆశ్రయించి అధికంగా నగదు చెల్లించి సింగపూర్ వెళ్లారు. అక్కడ తక్కువ వేతనానికి పనిచేసి మోసపోయి ఇండియన్ ఎంబసీలో ఆశ్రయం పొందుతూ.. స్వగ్రామానికి వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సాయం కోరుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, నారాయణపురం, జమలాపురం గ్రామాలకు చెందిన 19 మంది (12 మంది మహిళలు, ఏడుగురు పురుషులు) నూజివీడు, హైదరాబాద్కు చెందిన దళారుల ద్వారా 2022 డిసెంబరు 17న సింగపూర్ బయల్దేరారు. వెళ్లిన వారిలో ఓరుగంటి రుక్మిణి, ఇమ్మడి చిన్నరాధమ్మ, స్వర్ణ రాజమ్మ, మామిడి సుశీల, గుమ్మళ్ల శ్రీను, గుమ్మళ్ల రామారావు, స్వర్ణ నాగేశ్వరరావు, స్వర్ణ నాగమణి, స్వర్ణ తిరుపతిరావు తదితరులు ఉన్నారు.
భారత ఎంబసీలో ఆశ్రయం.. అధికంగా వేతనం ఇప్పిస్తామని చెప్పిన దళారులు ఒక్కొక్కరి నుంచి రూ.1.90 లక్షల నుంచి. 2.75 లక్షల వరకు తీసుకున్నారు. కొందరిని విమానం ద్వారా, కొందరిని ఓడల ద్వారా కౌలాలంపూర్ చేర్చారు. అక్కడి హోటళ్లలో స్వీపింగ్, క్లీనింగ్ పనులు చేయించారు. రోజుకు రూ.1,000 వేతనం ఇచ్చి అందులో కొంత కమీషన్ తీసుకున్నారు. వీరికి ముందుగా విజిటింగ్ వీసా ఇచ్చి, రెండు నెలల్లో వర్కింగ్ వీసా ఇస్తామని నమ్మబలికారు. వేతనాలు తిండి ఖర్చులకే సరిపోవటంతో ఎర్రుపాలెం మండల వాసులు దళారులను సంప్రదించారు. ఆరు నెలలు కావడంతో స్వదేశానికి తిరిగి వెళ్లేలా వీసాలు ఇప్పించాలని కోరటంతో నేడు, రేపు అంటూ దళారులు నాన్చటంతో కౌలాలంపూర్లో తెలుగు సంఘాలను ఆశ్రయించారు. వారి ద్వారా ఇండియన్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నారు. తాము స్వదేశానికి రావాలంటే ఒకొక్కరికి రూ. 60వేలు అవసరమవుతాయని బంధువులకు తెలిపారు. న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. స్వర్ణ వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు దళారులు మందపాటి నాగబాబు, పొదిళ్ల దశరథనాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.సురేష్ తెలిపారు.
అధిక వేతనం ఇస్తారనే ఆశతో అప్పుచేసి మా అమ్మ ఓరుగంటి రుక్మిణి, బంధువులు సింగపూర్ వెళ్లారు. విజిటింగ్ వీసాలు ఇచ్చి దళారులు మోసగించారు. తిరిగి వచ్చేందుకు వారి వద్ద డబ్బు లేదు. ప్రభుత్వం స్పందించి స్వదేశానికి వచ్చేలా చూడాలి.
ఓరుగంటి వెంకటకృష్ణ, రాజుపాలెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్