ఉనికి చాటాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉనికి చాటాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. తాజాగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జిలను ప్రకటించింది.
ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉనికి చాటాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. తాజాగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జిలను ప్రకటించింది. ఖమ్మం జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జితోపాటు పది శాసనసభ స్థానాలకు సమన్వయ బాధ్యులను నియమించింది.
ఏజెన్సీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
వరంగల్కు చెందిన కలవాల త్రిలోకేశ్వర్ను ఖమ్మం జిల్లా భాజపా ఇన్ఛార్జిగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నియమించారు. పినపాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా అజ్మీరా కృష్ణవేణినాయక్, ఇల్లెందు- కటకం నర్సింగ్రావు, ఖమ్మం- మారేపల్లి విష్ణువర్ధన్రెడ్డి, పాలేరు- పెదగాని సోమయ్యగౌడ్, మధిర- జలగం రంజిత్, వైరా- కూసంపూడి రవీంద్ర, సత్తుపల్లి- కనగాల వెంకట్రామయ్య, కొత్తగూడెం- మేఘనాథ్, అశ్వారావుపేట- గాదె రాంబాబు, భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాటి కృష్ణ నియమితులయ్యారు. పార్టీ శ్రేణులను శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించేందుకు ఇన్ఛార్జిలకు సమన్వయ బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం అప్పగించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు ఉభయ జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో ఇటీవల పర్యటించారు. కార్యకర్తలను కలిసి ఆశావహుల బలాబలాలపై ఆరా తీశారు. ఈసారి ప్రత్యేకంగా ఏజెన్సీ నియోజకవర్గాలపై భాజపా దృష్టి సారించింది. ఎస్టీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ముఖ్యనేతల పర్యటనలతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీకి ఆశించిన బలం లేకపోవడం కమలదళాన్ని కలవరపెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్క.. పక్కాగా
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల క్రతువులో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లలో నిక్షిప్తమైన ఓట్లు ఎవరికి అధికారం కట్టబెడతాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: కలెక్టర్
[ 02-12-2023]
ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144వ సెక్షన్, నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఏ పెట్టెలో.. ఎవరికి యోగమో?
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్లను ఖమ్మం గ్రామీణం మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో, భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్లను పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. -
పోటా పోటీ.. ఎవరు మేటి
[ 02-12-2023]
2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ జిల్లాలో విభిన్న ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో తెరాస గాలి వీయగా జిల్లాలో మాత్రం పూర్తి ప్రత్యేక శైలి కనిపించింది. ఖమ్మం ఓటరా మజాకా? అన్నట్లుగా ఇక్కడ విశ్లేషణాత్మక తీర్పు కనిపించింది. -
నివురుగప్పిన నిప్పులా దండకారణ్యం
[ 02-12-2023]
భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పెదమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని బెస్తకొత్తూరు-చినమిడిసిలేరు మధ్యలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని బుధవారం 40 కిలోల మందుపాతరను ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. -
తగ్గేదేలే..!!
[ 02-12-2023]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో పాలేరు నియోజకవర్గం తగ్గేదేలే.. అంటోంది. 2023 ఎన్నికల్లో పోలింగ్ పరంగా ఉభయ జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచింది.. రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది. 2014, 2018, 2023.. -
ప్రచారంలో భళా.. పోలింగ్లో డీలా
[ 02-12-2023]
ఎన్నికలేవైనా మహిళలకు ఉండే ప్రాధాన్యమే వేరు. వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవటానికి రాజకీయ పార్టీలు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటంతో వారే అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తారని అందరూ భావించారు. -
ఎయిడ్స్ బాధితులపై మానవత్వాన్ని ప్రదర్శించాలి
[ 02-12-2023]
ఎయిడ్స్ బాధితులపై వివక్షకు బదులు మానవత్వాన్ని ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కొత్తగూడెం తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో ‘సెక్యూర్’ సంస్థ ఆధ్వర్యాన అవగాహన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. -
ముక్కోటి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
[ 02-12-2023]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. -
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
[ 02-12-2023]
ఖమ్మం గ్రామీణం మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటర్ల నిర్ణయాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలు, కంట్రోల్యూనిట్లు, బ్యాలెట్యూనిట్లు, వీవీప్యాట్లు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. -
సార్వత్రిక ప్రవేశాల గడువు పొడిగింపు
[ 02-12-2023]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం హైదరాబాద్ ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరంలో ఓపెన్ స్కూల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందటానికి స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ను ఈనెల... -
ఓటు వేయలేకపోయిన పంచాయతీ సిబ్బంది
[ 02-12-2023]
అధికారుల నిర్లక్ష్యంతో రఘునాథపాలెం మండలానికి చెందిన పంచాయతీ కార్మికులు కొందరు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.


తాజా వార్తలు (Latest News)
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య