వినాయకుడికి వీడ్కోలు పలకాలిలా..
నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరే సమయం ఆసన్నమైంది. నిమజ్జనోత్సవాన్ని బుధ, గురువారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిమజ్జన క్రతువులో స్వీయరక్షణే ముఖ్యం
ఖమ్మం: మున్నేరు వద్ద ల్యాడర్ సాయంతో విద్యుద్దీపాలను అమర్చుతున్న సిబ్బంది
ఖమ్మం నేరవిభాగం, ఖమ్మం సాంస్కృతికం, న్యూస్టుడే: నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరే సమయం ఆసన్నమైంది. నిమజ్జనోత్సవాన్ని బుధ, గురువారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విగ్రహాల నిమజ్జన సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
పెరిగిన విగ్రహాల సంఖ్య: కొవిడ్ ప్రభావంతో మూడేళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాల కళ తగ్గింది. ఈ ఏడాది భారీగా విగ్రహాలు నెలకొల్పి వేడుకలు నిర్వహిస్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా వీధివీధినా మండపాలను ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు. పట్టణాల్లోని బహుళ అంతస్తు భవనాల్లోనూ సొంతంగా విగ్రహాలను ఏర్పాటుచేసుకున్నారు. ఖమ్మం నగరంలో సుమారు 1,000, కొత్తగూడెంలో 500, భద్రాచలంలో 300, పాల్వంచలో 200 విగ్రహాలు కొలువైనట్లు సమాచారం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 3,833 చిన్ననీటి వనరులున్నాయి. ఖమ్మం నగర శివార్లలో మున్నేరుతోపాటు జిల్లాలో సాగర్ ప్రధాన కాల్వ, వైరా నది, పాలేరు, వైరా చెరువులున్నాయి. భద్రాద్రి జిల్లాలో గోదావరి నది, కిన్నెరసానితోపాటు, వివిధ వాగులు, చెరువులున్నాయి. గోదావరి, మున్నేరుతోపాటు ప్రధానమైన చెరువుల్లో ఎక్కువగా గణనాథులను నిమజ్జనం చేస్తారు.
పటిష్ఠ రక్షణ చర్యలు: నిమజ్జన పాయింట్ల వద్ద అధికారులు పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా లైటింగ్, క్రేన్లు, రిలీజింగ్ క్లాంపులు, సమాచారం తెలియజేసేలా మైకులు, బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఖమ్మంలో గాంధీచౌక్ వద్ద స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేశ్ నిమజ్జన శోభాయాత్రను బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ ప్రారంభించనున్నారు.
భక్తులకు సూచనలు
- మండపాల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు విగ్రహాలను తరలించాలి.
- విగ్రహాలను మండపం నుంచి తీసే సమయంకన్నా ముందే విద్యుత్తు సౌకర్యాన్ని తొలగించాలి.
- విగ్రహాలను తరలించే సమయంలో పైన అడ్డొచ్చిన విద్యుత్తు తీగలను చేతితో తొలగించరాదు.
- విద్యుత్తు తీగలతో సమస్య ఉంటే కంట్రోల్ రూం నంబర్ 94408 11525 కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తారు.
- లోతు, నీటి ప్రవాహ ఉద్ధృతి తక్కువగా ఉండే ప్రాంతంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
- నీటి వనరుల్లోకి ఎక్కువ మంది కాకుండా ఈత సక్రమంగా వచ్చిన కొందరే వెళ్లాలి.
- పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసే సమయంలో వాటి కింద, ముందు, వెనుక వైపు భాగాల్లో ఎవరూ ఉండొద్దు.
- పిల్లలు, మహిళలను నిమజ్జన ప్రాంతానికి తీసుకువెళ్లకపోవటమే ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
[ 08-12-2023]
రాష్ట్రానికి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అమాత్యయోగం
[ 08-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. -
రామాలయ ధర్మకర్తల మండలిపై ఆశలు!
[ 08-12-2023]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పురస్కారం ప్రదానం
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్ అవార్డు అందుకున్నారు. -
మూడు ఎంఎల్ పార్టీలు విలీనం: పోటు
[ 08-12-2023]
పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
[ 08-12-2023]
ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
ఈవీఎంల భద్రతకు అదనపు గోదాం నిర్మాణం: కలెక్టర్
[ 08-12-2023]
ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అల ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. -
ముక్కోటి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 08-12-2023]
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు. -
కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల సత్తా
[ 08-12-2023]
నాగ్పూర్లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్లో పది మంది, బాడీ బిల్డింగ్లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు. -
వర్జీనియా రైతులను ఆదుకుంటాం
[ 08-12-2023]
తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం... -
కర్షకులకు పంట నష్ట పరిహారం అందించాలి
[ 08-12-2023]
మిగ్జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సీతారామ కల్యాణం పరమానంద భరితం
[ 08-12-2023]
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. -
పారా మిక్సో వైరస్ కలకలం
[ 08-12-2023]
ఇల్లెందులో పారామిక్సో వైరస్ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది. -
21న కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
[ 08-12-2023]
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6, 8 తరగతుల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ గురువారం ప్రకటించారు. -
జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక
[ 08-12-2023]
జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్-14 బాలుర...


తాజా వార్తలు (Latest News)
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
-
Extra Ordinary Man Movie Review: రివ్యూ: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. కామెడీ ఎంటర్టైనర్తో నితిన్ హిట్ అందుకున్నారా..?
-
సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్రావు
-
BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా
-
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష