కొనసాగుతున్న అక్రమాల పరంపర
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) శాఖల్లో అక్రమాల పరంపర కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి బ్రాంచిలో ‘ముద్ర’ రుణాల పంపిణీలో అక్రమాలకు పాల్పడినందుకు మేనేజర్ను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
మరో మూడు బ్యాంకుల్లోనూ స్వాహాలు
ములకలపల్లి బ్రాంచి మేనేజర్ కిశోర్ సస్పెన్షన్
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) శాఖల్లో అక్రమాల పరంపర కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి బ్రాంచిలో ‘ముద్ర’ రుణాల పంపిణీలో అక్రమాలకు పాల్పడినందుకు మేనేజర్ను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ములకలపల్లి బ్రాంచి మేనేజర్ కిశోర్ను కూడా ముద్ర, ఇతర రుణాలు, పలు రకాల అక్రమాలకు పాల్పడినందుకు డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషయ్య మంగళవారం సస్పెండ్ చేశారు. టేకులపల్లి, మర్లపాడు బ్రాంచిల్లో అక్రమాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ములకలపల్లిలో భారీగా అవకతవకలు: ములకలపల్లి బ్రాంచిలో అక్రమాలకు సంబంధించి అక్కడ సొసైటీ డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఆరు నెలల క్రితం డీసీసీబీకి ఫిర్యాదు చేశారు. డీజీఎం ఆర్.ఉపేందర్, ఏజీఎం అజయ్రెడ్డిని విచారణ అధికారులుగా బ్యాంకు పాలకవర్గం నియమించింది. విచారణలో వివిధ రకాల అక్రమాలు వెలుగుచూశాయి. బ్యాంకు మేనేజర్, బిజినెస్ కరస్పాండెంట్, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు సిబ్బందితో పాటు అనర్హులకు విరివిగా ముద్ర రుణాలను మంజూరు చేసినట్లు తేల్చారు. అనర్హుల పేరిట మంజూరు చేసి సుమారు రూ.కోటి వరకు వీరే కాజేసినట్లు సమాచారం. సహకార సంఘాల రైతులు చెల్లించిన రుణాలను పెద్దఎత్తున స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. బినామీ పేరుతో పెట్రోలు బంకు ఏర్పాటు, ఇందుకు అవసరమైన స్థల సేకరణ తదితర అంశాల్లో మేనేజర్ వ్యవహార శైలిపై డీసీసీబీ సీరియస్గా ఉంది. బ్యాంకు మేనేజర్ను సస్పెండ్ చేసి ఇక్కడే అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న భూక్యా రవికి ఇన్ఛార్జి మేనేజర్ బాధ్యతలు అప్పగించింది.
టేకులపల్లి, మర్లపాడులో కొనసాగుతున్న విచారణ... టేకులపల్లి, మర్లపాడు బ్రాంచిల్లో అక్రమాలపై డీసీసీబీకి ఫిర్యాదులు అందాయి. వీటిపై స్థానిక నోడల్ అధికారులను విచారణ అధికారులుగా నియమించారు. ప్రస్తుతం ఈ రెండు బ్రాంచిల్లో అధికారులు విచారణ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అక్రమాలపై విచారణ అధికారులు డీసీసీబీకి నివేదిక అందించనున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో కొంతకాలం నుంచి ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ మేనేజర్లలో మార్పు రాకపోవడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఇతర కొన్ని బ్యాంకుల్లో సైతం ముద్ర రుణాలు, ఇతర రుణాల పంపిణీ విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై డీసీసీబీ సీఈఓ అట్లూరి వీరబాబు ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం
[ 08-12-2023]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన సమావేశంలో భారాస నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ..నియోజకవర్గంలో చరిత్రలో లేనివిధంగా అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. -
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
[ 08-12-2023]
రాష్ట్రానికి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అమాత్యయోగం
[ 08-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. -
రామాలయ ధర్మకర్తల మండలిపై ఆశలు!
[ 08-12-2023]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పురస్కారం ప్రదానం
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్ అవార్డు అందుకున్నారు. -
మూడు ఎంఎల్ పార్టీలు విలీనం: పోటు
[ 08-12-2023]
పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
[ 08-12-2023]
ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
ఈవీఎంల భద్రతకు అదనపు గోదాం నిర్మాణం: కలెక్టర్
[ 08-12-2023]
ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అల ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. -
ముక్కోటి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 08-12-2023]
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు. -
కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల సత్తా
[ 08-12-2023]
నాగ్పూర్లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్లో పది మంది, బాడీ బిల్డింగ్లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు. -
వర్జీనియా రైతులను ఆదుకుంటాం
[ 08-12-2023]
తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం... -
కర్షకులకు పంట నష్ట పరిహారం అందించాలి
[ 08-12-2023]
మిగ్జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సీతారామ కల్యాణం పరమానంద భరితం
[ 08-12-2023]
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. -
పారా మిక్సో వైరస్ కలకలం
[ 08-12-2023]
ఇల్లెందులో పారామిక్సో వైరస్ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది. -
21న కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
[ 08-12-2023]
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6, 8 తరగతుల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ గురువారం ప్రకటించారు. -
జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక
[ 08-12-2023]
జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్-14 బాలుర...


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ