పర్యాటక అభివృద్ధే శ్రీరామరక్ష..!
భద్రాచలం పరిసరాలు ఆధ్యాత్మికంగాను, పర్యాటకంగాను భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పలు సుందర ప్రాంతాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి.
నేడు పర్యాటక దినోత్సవం
రామాలయం అభివృద్ధి నమూనా
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం పరిసరాలు ఆధ్యాత్మికంగాను, పర్యాటకంగాను భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పలు సుందర ప్రాంతాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి. దైవ దర్శనాలు ఒక వైపు మనసుకు ప్రశాంతతను అందిస్తుండగా చూడచక్కని రమణీయ ప్రదేశాలు అంతులేని ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి పనులే పర్యాటకానికి శ్రీరామ రక్ష. ప్రతిపాదనల్లో ఉన్న పనులన్నీ పూర్తయితే యాత్రికులకు ఇదో ఆనందధామంగా విరాజిల్లనుంది.
ఆధ్యాత్మికత ఆహ్లాదం..
భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని గోదావరిలో బోట్ షికార్ చేస్తే ఆ ఆనందమే వేరు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు వస్తే ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 11 ప్రాంతాలను కలుపుతూ రామాయణ వలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భద్రాచలం పేరు ఉంది. దీనికి సంబంధించిన ప్రత్యేక రైలునూ ప్రారంభించారు. ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ప్రచారం చేస్తే భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది. గోదావరి కరకట్టను సుందరంగా తీర్చిదిద్దితే పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
- ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైను పనులకు సర్వేలు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. పాపికొండల యాత్ర ప్రస్తుతం ఆగినా గోదావరిపై ఈ ప్రయాణం చేస్తే జీవితాంతం గుర్తిండిపోయే మధురానుభూతులను మిగుల్చుతుంది. భద్రాచలం నుంచి 120 కి.మీ. దూరంలో ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతం ప్రత్యేకతే వేరు. దీన్ని తెలంగాణ నయాగరాగానూ పలువురు అభివర్ణిస్తున్నారు.
సందర్శనీయం.. సంతోషకరం
- దుమ్ముగూడెం మండలం పర్ణశాల దర్శనం ఎంతో పవిత్రం. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రాంతమిది. సీతమ్మవారి నార చీరల చారలు ఇప్పటికీ కనిపిస్తాయి. రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు వేదిక ఇది. భద్రాచలం నుంచి 35 కి.మీ దూరంలో ఉంది.
- కాకతీయుల కాలంలో 600 సంవత్సరాల కిందట నిర్మించిన బూర్గంపాడు మండలం మోతెగడ్డ దివ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనది. భద్రకాళీ సమేత వీరభద్రుడు కొలువైన ఈ క్షేత్రాన్ని శివరాత్రికి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
- సీతాదేవిని రావణుడు అపహరించుకుని తీసుకెళుతున్న సమయంలో జటాయు అనే పక్షి అడ్డుకుని భీకర పోరు చేస్తుంది. ఈ సమయంలో పక్షి రెక్క తెగిన ప్రాంతమే కాలక్రమంగా ఎటపాకగా మారందని ప్రతీతి. ఇది దర్శనీయ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
- వనవాసం సమయంలో ప్రయాణ బడిలికతో ఉన్న సీతమ్మవారు స్నానం చేసేందుకు నీళ్లు అవసరమయ్యాయి. ఇందుకు రాముడు బాణం వదిలిన ప్రాంతం నుంచి వేడి నీళ్లు బయటకు వస్తాయి. ఈ ప్రాంతమే ఉష్ణ గుండాల అని పౌరాణిక గాథ. భద్రాచలానికి
- 6 కి.మీ దూరంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
[ 08-12-2023]
రాష్ట్రానికి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అమాత్యయోగం
[ 08-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. -
రామాలయ ధర్మకర్తల మండలిపై ఆశలు!
[ 08-12-2023]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పురస్కారం ప్రదానం
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్ అవార్డు అందుకున్నారు. -
మూడు ఎంఎల్ పార్టీలు విలీనం: పోటు
[ 08-12-2023]
పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
[ 08-12-2023]
ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
ఈవీఎంల భద్రతకు అదనపు గోదాం నిర్మాణం: కలెక్టర్
[ 08-12-2023]
ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అల ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. -
ముక్కోటి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 08-12-2023]
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు. -
కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల సత్తా
[ 08-12-2023]
నాగ్పూర్లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్లో పది మంది, బాడీ బిల్డింగ్లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు. -
వర్జీనియా రైతులను ఆదుకుంటాం
[ 08-12-2023]
తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం... -
కర్షకులకు పంట నష్ట పరిహారం అందించాలి
[ 08-12-2023]
మిగ్జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సీతారామ కల్యాణం పరమానంద భరితం
[ 08-12-2023]
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. -
పారా మిక్సో వైరస్ కలకలం
[ 08-12-2023]
ఇల్లెందులో పారామిక్సో వైరస్ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది. -
21న కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
[ 08-12-2023]
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6, 8 తరగతుల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ గురువారం ప్రకటించారు. -
జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక
[ 08-12-2023]
జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్-14 బాలుర...


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
ISRO: మిత్రో.. చూసొద్దామా ఇస్రో.. విద్యార్థులకు అరుదైన అవకాశం
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో