ముప్పు ఎరగక.. అప్పు తీరక..
ప్రభుత్వం రైతులకు రుణమాఫీ మంజూరు చేసి రెణ్నెల్లు కావస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద 1,38,187 మంది రుణాలు పొందారు. వీరిలో ఇప్పటివరకు 58,422 మందికి రూ.243.85 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
కొత్తగూడెంలోని ఓ బ్యాంక్లో రుణాలు పొందేందుకు వేచిఉన్న గిరిజన రైతులు
కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్టుడే: ప్రభుత్వం రైతులకు రుణమాఫీ మంజూరు చేసి రెణ్నెల్లు కావస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద 1,38,187 మంది రుణాలు పొందారు. వీరిలో ఇప్పటివరకు 58,422 మందికి రూ.243.85 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం 15,363 మంది రెన్యువల్ చేసుకుని రూ.98.96 కోట్ల కొత్త రుణాలు పొందారు. రుణమాఫీ జరిగిన లబ్ధిదారుల్లో ఇది కేవలం 41 శాతం మాత్రమే. అర్హులందరికీ కొత్త రుణాలివ్వాలని ఈనెల 23న బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రియాంక సూచించారు.
రెండు దఫాలు..
2018 డిసెంబరు 11 నాటికి రుణాలు పొందిన రైతులకు ప్రభుత్వం మాఫీ వర్తింపజేసింది. తొలివిడత రూ.25వేలలోపు వారికి, అంటే 54,036 మందికి రూ.212.46 కోట్ల రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. తర్వాత రూ.50వేల నుంచి రూ.99 వేల లోపు రుణాలున్న 24,982 మందికి రూ.149.31 కోట్లు మంజూరయ్యాయి.
జాప్యానికి కారణాలు ఇవే..
ఖాతాల నిర్వహణ సరిగా లేక డీఫాల్ట్ కావడం, కొన్ని బ్యాంకులు విలీనమవడం, ఇతర కారణాలతో రుణమాఫీ ప్రక్రియ జాప్యమవుతోంది. ఫలితంగా కొత్త రుణాలివ్వడంలో ఆలస్యం జరుగుతోంది. వడ్డీ భారం, రిజిస్ట్రేషన్ (పార్టిషన్, సేల్, గిఫ్ట్డీడ్ మొ.వి.) అవసరాల కోసం కొందరు మాఫీకి ముందే రుణాలు చెల్లించారు. తమ లోను ఖాతాలు మూసేసుకున్నారు. అయినా వీరు మాఫీకి అర్హులే. దీంతో పాటు కొన్ని బ్యాంక్లు విలీనం అయ్యాయి. మరికొందరు 2018కి ముందు పాత పట్టాదారు పాసు పుస్తకాలు దరఖాస్తుకు జతచేశారు. ఆయా వివరాలు ‘ధరణి’ వివరాలతో సరిపోలడం లేదు. కొందరి విషయంలో విస్తీర్ణం, గ్రామాల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. రుణానికి వడ్డీ తోడై అప్పు రెండింతలు కావడం, మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే కారణంతో కొందరు బ్యాంకుల వైపే వెళ్లడం లేదు. ఒకే ఆధార్తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారూ ఉన్నారు. లోను ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, మృతిచెందిన వారివి రద్దు కావడంతో ఇంకొందరికి నిధులు పెండింగ్లో పడ్డాయి. ఈ కారణాలతో కొత్తగా రుణాలిచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
రుణమాఫీ నిధులు మంజూరై.. ఖాతాల్లో జమకాని వారి వివరాలను బ్యాంకర్ల నుంచి సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ, బ్యాంకుల అధికారులు క్లస్టర్ల వారీగా గ్రామాలకు వెళ్లి రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణమాఫీ ఎందుకు జాప్యమవుతోంది? పరిష్కారాలేమిటో వివరిస్తున్నారు. అనంతరం రెన్యువల్ చేసుకొనేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
[ 08-12-2023]
రాష్ట్రానికి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అమాత్యయోగం
[ 08-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. -
రామాలయ ధర్మకర్తల మండలిపై ఆశలు!
[ 08-12-2023]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పురస్కారం ప్రదానం
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్ అవార్డు అందుకున్నారు. -
మూడు ఎంఎల్ పార్టీలు విలీనం: పోటు
[ 08-12-2023]
పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
[ 08-12-2023]
ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
ఈవీఎంల భద్రతకు అదనపు గోదాం నిర్మాణం: కలెక్టర్
[ 08-12-2023]
ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అల ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. -
ముక్కోటి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 08-12-2023]
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు. -
కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల సత్తా
[ 08-12-2023]
నాగ్పూర్లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్లో పది మంది, బాడీ బిల్డింగ్లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు. -
వర్జీనియా రైతులను ఆదుకుంటాం
[ 08-12-2023]
తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం... -
కర్షకులకు పంట నష్ట పరిహారం అందించాలి
[ 08-12-2023]
మిగ్జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సీతారామ కల్యాణం పరమానంద భరితం
[ 08-12-2023]
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. -
పారా మిక్సో వైరస్ కలకలం
[ 08-12-2023]
ఇల్లెందులో పారామిక్సో వైరస్ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది. -
21న కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
[ 08-12-2023]
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6, 8 తరగతుల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ గురువారం ప్రకటించారు. -
జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక
[ 08-12-2023]
జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్-14 బాలుర...


తాజా వార్తలు (Latest News)
-
BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా
-
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
-
ChandraBabu: జగన్ ప్రభుత్వం కూడా అహంకారంతో ఉంది: చంద్రబాబు
-
Bobby Deol: ఇంతటి విజయాన్ని ఊహించలేదు.. ఆయన నా జీవితాన్ని మార్చేశారు : బాబీ దేవోల్
-
TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ
-
Supreme Court: విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు