ఓట్ల వేటలో.. వ్యూహరచనలో..
ఖమ్మం జిల్లాలోని ఓ జనరల్ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి ‘పోల్ స్ట్రాటజీ గ్రూప్’ అనే యాప్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను నాలుగు విభాగాలు(రంగులు)గా విభజిస్తున్నారు. అనుకూలురు(గ్రీన్), తటస్థులు (ఎల్లో), స్థానికంగా ఓటుహక్కు కలిగి ఇతరచోట్ల నివసిస్తున్నవారు (బ్లూ), ఇతర పార్టీల మద్దతుదారులు (రెడ్)గా పరిగణిస్తున్నారు.
ఎత్తుగడలతో ప్రత్యర్థులకు దడ
ఖమ్మం జిల్లాలోని ఓ జనరల్ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి ‘పోల్ స్ట్రాటజీ గ్రూప్’ అనే యాప్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను నాలుగు విభాగాలు(రంగులు)గా విభజిస్తున్నారు. అనుకూలురు(గ్రీన్), తటస్థులు (ఎల్లో), స్థానికంగా ఓటుహక్కు కలిగి ఇతరచోట్ల నివసిస్తున్నవారు (బ్లూ), ఇతర పార్టీల మద్దతుదారులు (రెడ్)గా పరిగణిస్తున్నారు. మరోపార్టీ అభ్యర్థి సైతం ఇలాంటి విధానమే అవలంబిస్తున్నారు. ఓటర్లను ‘పోల్ మేనేజ్మెంట్’ అనే యాప్లో మూడు విభాగాలు (ఏ, బీ, సీ)గా వర్గీకరిస్తున్నారు. తనకు పక్కాగా ఓటేసేవారు (ఏ), తటస్థులు (బీ), ఇతర పార్టీల మద్దతుదారులను (సీ)లో చేర్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలోని మరో జనరల్ నియోజకవర్గంలో పరిస్థితి విచిత్రంగా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ సాయంత్రం వరకు ప్రచారం ముగించి.. ముఖ్య అనుచరులు, నాయకులు తమవైపే ఉన్నారా లేదా అని సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థుల తాయిలాల వలకు చిక్కకుండా అప్రమత్తమవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో త్రిముఖపోరు నెలకొంది. పోలింగ్ గడువు సమీపిస్తున్నకొద్దీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పరిస్థితి ఏంటనే అంశంపై తర్జనభర్జనలకే సమయం సరిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆత్మీయ పలకరింపులకు పూనుకుంటున్నారు. వయస్సు, సామాజిక వర్గాలుగా ఓటర్లను విభజించి వారిని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
వైరా, నేలకొండపల్లి, న్యూస్టుడే : శాసనసభ ఎన్నికల సమరం జోరందుకుంది. పోలింగ్కు తొమ్మిది రోజుల గడువు ఉండటంతో విజయ సాధనకు అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు. పోలింగ్ ముగిసే వరకూ తమవైపు అనుకూల పవనాలు వీచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఓటర్లను ఆకర్షించటంతో పాటు ప్రత్యర్థి శిబిరం నుంచి ముప్పు తప్పించుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
పోల్ మేనేజ్మెంట్పై దృష్టి
ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారమెలా సాగుతున్నా చివరి మూడు రోజులు పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అనే పేరుంది. ప్రచారం ఎంత చేసినా, ప్రలోభపెట్టినా పోలింగ్ కేంద్రం వరకు ఓటరును తీసుకొచ్చే బాధ్యతలను ద్వితీయశ్రేణి నాయకులకు అప్పగిస్తుంటారు. ఓటేసే వరకు ఓటర్లను పలకరించేలా తన అనుచరులను పురమాయిస్తుంటారు. దూరభారంతో ఇబ్బంది పడే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా ప్రత్యేకంగా ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చుతుంటారు.
సంఘాలతో సమావేశాలు
వైద్యులు, ఆర్ఎంపీలు, మెడికల్, లారీ అసోసియేషన్లు, ఆటో డ్రైవర్లు, దర్జీలు, నాయీబ్రాహ్మణులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, చేతివృత్తుల సంఘాలను ప్రసన్నం చేసుకునేలా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోరుకున్న వారికి ప్రత్యేక ‘పార్టీలు’ ఇస్తూ పోలింగ్ నాటికి అంతా చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పది నియోజకవర్గాలున్నాయి. అన్నిచోట్లా ఇంచుమించు ఇదే వైఖరిని ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుసరిస్తున్నారు. అనుకూల ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే తటస్థులు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇతర పార్టీల మద్దతుదారుల కదలికలపైనా నిఘా ఉంచుతున్నారు. అనుకూల ఓటర్లకు మర్యాద తగ్గకుండా చూస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామస్థాయిలో ప్రాబల్యం చూపేవారి కోరికలను వెనువెంటనే తీర్చేస్తున్నారు. తటస్థ ఓటర్లు ఏం ఆశిస్తున్నారో తెలుసుకొని వారిని ఆకర్షించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడొద్దని ప్రధాన అనుచరులకు స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు ఇతర పార్టీల మద్దతుదారులు రోజువారీగా ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు?ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అనే అంశాలపై ఆరాతీస్తున్నారు. అవసరమైతే అలాంటి వారిలో ఒకరిద్దరిని కోవర్టులుగా మార్చుకునేందుకూ యత్నిస్తున్నారు.
వన భోజనాలను అవకాశంగా మలచుకునేలా..
ఇప్పటికే కార్తికమాసం సందడి మొదలైంది. సామాజికవర్గాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి వీటినీ తమ విజయానికి అనుగుణంగా మలచుకోవాలని కొందరు అభ్యర్థులు యత్నిస్తున్నారు. ఈనెల 30లోపే కీలక ప్రాంతాల్లో వనభోజనాలను ముగించాలని కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అయ్యే ఖర్చును భరించటానికి సిద్ధపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
[ 08-12-2023]
రాష్ట్రానికి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అమాత్యయోగం
[ 08-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. -
రామాలయ ధర్మకర్తల మండలిపై ఆశలు!
[ 08-12-2023]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పురస్కారం ప్రదానం
[ 08-12-2023]
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్ అవార్డు అందుకున్నారు. -
మూడు ఎంఎల్ పార్టీలు విలీనం: పోటు
[ 08-12-2023]
పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
[ 08-12-2023]
ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
ఈవీఎంల భద్రతకు అదనపు గోదాం నిర్మాణం: కలెక్టర్
[ 08-12-2023]
ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అల ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. -
ముక్కోటి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 08-12-2023]
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు. -
కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల సత్తా
[ 08-12-2023]
నాగ్పూర్లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్లో పది మంది, బాడీ బిల్డింగ్లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు. -
వర్జీనియా రైతులను ఆదుకుంటాం
[ 08-12-2023]
తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం... -
కర్షకులకు పంట నష్ట పరిహారం అందించాలి
[ 08-12-2023]
మిగ్జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సీతారామ కల్యాణం పరమానంద భరితం
[ 08-12-2023]
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. -
పారా మిక్సో వైరస్ కలకలం
[ 08-12-2023]
ఇల్లెందులో పారామిక్సో వైరస్ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది. -
21న కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
[ 08-12-2023]
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6, 8 తరగతుల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ గురువారం ప్రకటించారు. -
జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక
[ 08-12-2023]
జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్-14 బాలుర...


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి