ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: ఎస్పీ
అర్ధరాత్రి సమయంలో మహిళననే సంకోచం లేకుండా ముగ్గురు నిందితులను ధైర్యంగా పట్టుకొన్న మహిళా కానిస్టేబుల్ టి.శివకుమారిని ఎస్పీ సిద్ధార్థకౌశల్ ప్రశంసించారు. కంచికచర్ల పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రాత్రి 11.45 గంటల సమయంలో
మహిళా కానిస్టేబుల్కు నగదు రివార్డు అందజేత
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: అర్ధరాత్రి సమయంలో మహిళననే సంకోచం లేకుండా ముగ్గురు నిందితులను ధైర్యంగా పట్టుకొన్న మహిళా కానిస్టేబుల్ టి.శివకుమారిని ఎస్పీ సిద్ధార్థకౌశల్ ప్రశంసించారు. కంచికచర్ల పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రాత్రి 11.45 గంటల సమయంలో ఓ లారీ డ్రైవర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగదు, ఫోన్, తదితరాలను అపహరించుకువెళ్లారు. బాధితుడు వెంటనే ఈ విషయాన్ని డయల్-100 ద్వారా తెలియజేయగా ఆ సమాచారం అందుకున్న శివకుమారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రహదారిపై సెంట్రీ విధులు నిర్వహిస్తుండగా అనుమానాస్పద రీతిలో ఒక స్కూటీపై ముగ్గురు యువకులు వస్తుండటాన్ని గమనించి అడ్డుకున్నారు. బండి తాళాన్ని తీసుకుని సెల్ఫోన్లో వారి ఫొటోలు తీసి సీఐ నాగేంద్రకుమార్కు పంపించారు. వారే నిందితులుగా లారీ డ్రైవర్ గుర్తుపట్టడంతో వెంటనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన ఆమెకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వీక్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డుతో పాటు నగదు రివార్డును అందజేశారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.
ఫిర్యాదుల స్వీకరణ: రోజూ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన వారి నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. కూచిపూడికి చెందిన వివాహిత భర్త ఆగడాలపై, కృత్తివెన్నుకు చెందిన వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాల్సిన బాకీదారుడు బెదిరిస్తున్నాడని, కైకలూరుకు చెందిన వృద్ధుడు ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడని, మరికొందరు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.