ఆర్బీకే సిబ్బంది నిర్లక్ష్యం
పెడన మండలంలో వ్యవసాయ శాఖ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఆర్బీకేల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగుల నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ లక్ష్యాలను నీరుగారుస్తోంది. దీనిపై మండల ఏవీ ఇటీవల ఎమ్మెల్యే జోగి రమేష్ను కలిసి పరిస్థితిని ఆయన
లక్ష్య సాధనలో వెనుకంజ
న్యూస్టుడే - పెడన
పెడన మండలంలో వ్యవసాయ శాఖ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఆర్బీకేల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగుల నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ లక్ష్యాలను నీరుగారుస్తోంది. దీనిపై మండల ఏవీ ఇటీవల ఎమ్మెల్యే జోగి రమేష్ను కలిసి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పెడన మండలంలో 17 గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 17 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. ఇటీవల పెడన పట్టణానికి కూడా ఆర్బీకేను మంజూరు చేయటంతో ఆ సంఖ్య 18కు చేరింది. పెడన, చేవేండ్ర, నందమూరు, చెన్నూరు, కొంకేపూడి ఆర్బీకేల్లో ఎంపీఈవోలు, మిగిలిన వాటిలో వీఏఏలు ఇన్ఛార్జులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకర్లమూడి, ఉరివి ఆర్బీకేల వీఏఏలు ఉద్యోగాలను వీడి వెళ్లటంతో ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం పలు బాధ్యతలను అప్పగించింది. ప్రధానంగా ఈక్రాప్ నమోదు, పంట నష్టం నమోదు, ధాన్యం కొనుగోళ్లు, ఈకేవైసీ తదితర బాధ్యతలను సచివాలయ పరిధిలో నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు పెడన మండలంలో దాదాపు 5 వేల హెక్టార్లలో వరి పంటను రైతులు నష్టపోయారు. ఆర్బీకేల్లో వారు అందుబాటులో లేకపోవటం, రైతులు వెళ్లినా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ఈకేవైసీని వంద శాతం పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నా ఈ మండలంలో సాధ్యం కాలేదు. 10,500 మంది రైతులకుగాను 8800 మంది మాత్రమే ఈప్రక్రియను పూర్తిచేశారు. ఖరీఫ్ పంట దిగుబడులు వస్తున్నా.. ఈకేవైసీ పూర్తికాకపోవటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు వీల్లేని పరిస్థితి తలెత్తింది. తప్పనిసరి పరిస్థితుల్లో కమిషన్ ఏజెంట్లకు తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమందికి ఈ క్రాప్ నమోదును కూడా పూర్తి చేయించలేకపోయారు. ఆర్బీకేలకు వెళితే సమాధానం చెప్పేందుకు కూడా సిబ్బంది ఆసక్తి చూపడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంత మంది వీఏఏలు నామమాత్రంగా విధులకు హాజరై వెళ్లిపోతున్నారని, మండల వ్యవసాయాధికారిని సైతం ఖాతరు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.