శుచీ.. శుభ్రత లేదు
ఉపాధ్యాయులు తరగతులకు సక్రమంగా హాజరుకారని, భోజనర కూడా బాగోదని గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్ నివాస్కు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల విద్యార్థులు జ్వరాల బారిన పడిన సంఘటనపై
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశం
విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ నివాస్
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: ఉపాధ్యాయులు తరగతులకు సక్రమంగా హాజరుకారని, భోజనర కూడా బాగోదని గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్ నివాస్కు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల విద్యార్థులు జ్వరాల బారిన పడిన సంఘటనపై ‘తల్లిదండ్రుల్లో కలవరం’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం స్పందించారు. మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె.నివాస్లు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడున్న వైద్యాధికారులతో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పలువురు ఉన్నతాధికారులతో కలిసి చిలకలపూడి ప్రాంతంలోని గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో సమస్యలు చెప్పడానికి తటపటాయిస్తుండటంతో వారిని వెళ్లిపోమని చెప్పి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తెలుగు, సైన్స్ ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. బియ్యం నాసిరకంగా ఉంటుందని, భోజనం అంతగా బాగుండడం లేదని, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ఇప్పటికే చెప్పామని కానీ పట్టించుకోలేదని చెప్పారు.
వసతులు కల్పించండి.. లేదా వేరే భవనం చూడండి
గురుకుల విద్యాలయంలోని విభాగాల వారీగా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఉండే గదుల్లో వెంటిలేటర్లకు తక్షణం మెష్లు వేయించాలని, తాగునీటిట్యాంకు శుభ్రంచేయించి క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. అనంతరం వంటగదిలోని ఆహార పదార్థాలను పరిశీలించారు. గురుకుల విద్యాలయం భవన నిర్మాణాలకు స్థలం కేటాయించినా పనులు ప్రారంభం కాలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న భవనంలో వసతులు కల్పించండి..లేదా వేరే భవనం చూడాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటూ డీఈవో తాహెరా సుల్తానా, ఆర్డీవో ఖాజావలీలకు చెప్పారు. విద్యాలయాన్ని తరచుగా పర్యవేక్షిస్తుండాలని ముడ వీసీ శివనారాయణరెడ్డికి చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా.సుహాసిని మాట్లాడుతూ విద్యార్థులకు నిర్వహించిన పలు పరీక్షల నివేదికలు నెగిటివ్ వచ్చాయని అయినా కొన్నాళ్లపాటు పాఠశాలలో వైద్యశిబిరం కొనసాగిస్తామని చెప్పారు. మేయర్ వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ షేక్సిలార్దాదా, తహసీల్దారు సునీల్బాబు పాల్గొన్నారు.
అందరికీ వైద్యపరీక్షలు చేయండి
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: విద్యార్థులందరికీ అవసరమైన అన్ని వైద్యపరీక్షలు చేయాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ..నీటి వసతులు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యఆరోగ్యశాఖతోపాటు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మైనారిటీ గురుకుల విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. విద్యార్థులకు ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని