పందేల జాతర
సంక్రాంతి సంప్రదాయం మాటున జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు జూదక్రీడలు కొనసాగాయి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ముందస్తుగా చేసిన హెచ్చరికలు నామమాత్రమే అయ్యాయి. ప్రధాన రహదారుల చెంతనే బహిరంగ బరులు, పేకాట శిబిరాలు
తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఫ్లడ్లైట్ల వెలుగులో జరిగిన కోడిపందేలు
సంక్రాంతి పర్వదినాల్లో చట్టపరంగా ఎన్ని హెచ్చరికలు చేసినా చాటుమాటుగా పందేలు, పేకాట వంటివి సర్వసాధారణ విషయాలే. ప్రస్తుతం యావత్ దేశాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న ఒమిక్రాన్ విస్తరణకు జూదక్రీడలు మరింత దోహదపడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు గతానికి భిన్నంగా దృష్టి సారిస్తారని భావించారు. అందుకు తగ్గ విధంగానే గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు 144 సెక్షన్ అమలు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం ఆచరణకు నోచుకోలేదు. భోగి ముందు వరకూ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేయడంతో పాటు పలువురిని బైండోవర్ చేసినా, మూడు రోజులకు అనుమతులొచ్చాయంటూ జూద నిర్వాహకులు చేసిన ప్రచారం వాస్తవమే అన్పించేలా ఫ్లడ్లైట్ల వెలుగుల్లో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పందేలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో కనీసం రెండుకు తగ్గకుండా పెద్దబరులు ఏర్పాటు చేశారు. వీటీల్లో ఒక్కో కోడిపందేనికి కనీసం రూ.లక్ష నుంచి పైచిలుకు నిర్ధారించారు. పేకాటకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసుకున్నారు. వీటికితోడు నెంబర్లాట, చిత్తాట, గుండాట, వంటి జూదక్రీడలు కూడా పెద్దమొత్తాలతో నిర్వహించారు. గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, తిరువూరు, పెండ్యాల కంచికచర్ల, తదితర ప్రాంతాల పరిధిలో నిర్వహించిన పందేలకు పొరుగు జిల్లాకు చెందిన వారు తరలివచ్చారు. బరి మామూళ్లు, మద్యం, ఇతర తినుబండారాల విక్రయ దుకాణాల ఏర్పాటు తదితరాల పరంగా నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. గడచిన ఏడాది తరహాలోనే బాపులపాడు మండలం అంపాపురంలో వివిధ హంగుల నడుమ భారీ పందేలు వేశారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని గండేపల్లి, పరిటాల, మచిలీపట్నం మండలం మేకావానిపాలెం, చల్లపల్లి, కొడాలి, కొక్కిలిగడ్డ ప్రాంతాల్లో రూ.లక్షల్లో చేతులు మారాయి. కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో విరామం లేకుండా జూదం సాగే విధంగా ఫిష్ట్ల వారీ జూద నిర్వాహకులను ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు సైతం వీటిని తిలకించేందుకు వచ్చారు. మోపిదేవి సమీపంలో పై పందేలతో సంబంధం లేకుండా గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ కోడి పందెం నిర్వహించారు. పేకాటలో పాల్గొనేందుకు రుసుములు వసూలు చేశారు. వత్సవాయి మండలం లింగాల, గుడ్లవల్లేరు మండలం అంగలూరు, మచిలీపట్నం మండలం శ్రీనివాసనగర్, మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, తదితర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణల కారణంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లింగాలలో గ్రామస్థులే పందేలను అడ్డుకున్నారు.
1,141 కేసులు.. 3,494 మంది అరెస్ట్
గడచిన వారం రోజులుగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 1,141 కేసులు నమోదు చేసిన పోలీసులు 3,494 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందేలకు సంబంధించి 464 కేసులు నమోదు చేసి రూ.6.57 లక్షలు, 44 పెట్టీ కేసుల్లో రూ.99,650, పేకాటకు సంబంధించి 355 కేసుల్లో రూ.7.05 లక్షలు, 278 పెట్టీ కేసుల్లో రూ.6.11 లక్షలతో పాటు 583 కోడిపుంజులు, 75కి పైగా బైక్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా