పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్రశిక్ష ద్వారా ఏటా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తయారు చేసే
మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్రశిక్ష ద్వారా ఏటా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తయారు చేసే ప్రణాళికనుబట్టి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తుంది.
ఎన్ని నిధులు అవసరం
జిల్లా వ్యాప్తంగా 2,800 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 3.60లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మౌలిక వసతుల దగ్గర నుంచి వారికి అందించే సదుపాయాల వరకు ఎంత ఖర్చవుతుందో లెక్కగట్టి ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను బట్టి నిధుల కేటాయింపు ఉంటుంది. దీనికి ముందే అధికారులు ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం కొవిడ్ దృష్ట్యా ఆన్లైన్లోనే వివరించి దానికి సంబంధించిన ప్రొఫార్మాలు అందజేశారు. పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులు అందులో ఉన్న అంశాల వారీగా వివరాలు నమోదు చేసి ఎంఈవోకి అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సేకరించిన సమాచారాన్ని బట్టి వారు మండలస్థాయి ప్రణాళిక తయారు చేసి జిల్లాకు అందించాలి. అలా తయారు చేసిన పాఠశాల, మండల, జిల్లాస్థాయి ప్రణాళికలు రాష్ట్రానికి అందించాలి. విద్యార్థుల సంఖ్య, అవసరమైన భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీలు, క్రీడా పరికాలు, ఉపాధ్యాయుల టీఎల్ఎం, దుస్తులు, పుస్తకాలు, దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు, వారికి అందించే వివిధ ప్రోత్సాహకాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఇలా ఏఅంశాన్ని వదలకుండా పూర్తిస్థాయిలో ప్రణాళిక తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. సమగ్రశిక్షలో ఉన్న అన్నివిభాగాల వారీగా ప్రణాళిక తయారు చేయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీసీ శేఖర్ తెలిపారు. ఫిబ్రవరి 15లోగా జిల్లాస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందని త్వరితగతిన ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఎంఈవోలను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.