కోఢీ
సంప్రదాయం పేరుతో సంక్రాంతి పండగను పురస్కరించుకుని సాగిన కోడిపందేలు, జూదక్రీడల్లో నగదు పెద్దమొత్తంలో చేతులు మారింది. పోలీసుల హెచ్చరికలను సైతం పక్కనపెట్టి భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. కత్తులు కట్టి నిర్వహించిన పోటీల్లో
నెత్తురోడిన బరులు
పెడన మండలంలో పందేనికి కోళ్లను సిద్ధం చేస్తున్న దృశ్యం
చెదురుమదురుగా ఘర్షణలు: కొన్ని బరుల్లో చిన్నచిన్న ఘర్షణలు తలెత్తాయి. పెడన బైపాస్లో ఏర్పాటు చేసిన బరి వద్ద శనివారం ఒక యువకుడు మద్యం సీసాను పగులగొట్టి విధ్వంసం చేశాడు. చెన్నూరు, నందమూరు, కాకర్లమూడి, నందిగామ, నడుపూరు గ్రామాల్లోనూ ఘర్షణలు జరిగాయి. కొంకేపూడిలో రెండు వర్గాల మధ్య బరుల విషయమై తలెత్తిన వివాదంతో పోటీలను నిలిపివేశారు.
బంటుమిల్లి: మండలంలోనూ బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు.రాత్రిళ్లు జూదక్రీడలు నిర్వహించారు.
ముదినేపల్లి: గ్రామగ్రామాన కోడిపందేలు జోరుగా సాగాయి. మహిళలు సైతం ఆసక్తిగా తిలకించారు. పేరూరు, అన్నవరం, దేవపూడి, చినవాడవల్లిలో బరుల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బరుల వద్ద ఎవరూ ఫొటోలు తీయకుండా నిర్వాహకులు యువకులను నియమించుకున్నారు.
కలిదిండి: మండలంలో కోడిపందేలు, పేకాట శిబిరాలు మూడు రోజులపాటు యథేచ్ఛగా సాగాయి. పండగ ప్రారంభానికి ముందురోజు పోలీసులు మొక్కుబడిగా నిర్వహించిన దాడుల్లో కొన్నిచోట్ల శిబిరాలను కూల్చివేశారు. అసలు జూదాలు మొదలైన తరవాత చూసీచూడనట్లుగా వదిలేశారనే విమర్శలు వినిపించాయి.
తిరువూరు: తిరువూరు నియోజకవర్గంలో కోడిపందేలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు సైతం రావడం విశేషం.బరుల పక్కనే పేకాట, గుండాట, నంబర్లాట జోరుగా సాగింది. ఫ్లడ్లైట్లు, గ్యాస్ లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు జూదాలు కొనసాగాయి. బరులన్నీ జనాలతో కిటకిటలాడుతూ కొన్నిచోట్ల జాతరను తలపించింది. వాహనాల యజమానుల నుంచి కొన్నిచోట్ల ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు.బరిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఒప్పందం చేసుకోగా, పై పందేలు పెద్దఎత్తున కాశారు. తిరువూరు మండలం మల్లేలలో జరిగిన కోడిపందేలకు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, విస్సన్నపేట మండలంలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్.దేవదత్ హాజరయ్యారు.
గంపలగూడెం: మండలంలో నిర్వహించిన పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, పలువురు డైరెక్టర్లు, ఖమ్మం నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు ఆదివారం వచ్చారు. నెమలి సమీపంలో ఏర్పాటు చేసిన పందేలను ఆసక్తిగా తిలకించారు. జూదం(కోసు), చిత్తులాట (పట్టాలాట) లో పెద్దమొత్తంలో చేతులు మారాయి. బరుల వద్ద మద్యం అమ్మకాలూ జోరుగా సాగాయి. పలు గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ నిలిచిపోయింది. మద్యం మత్తులో పలువురు యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారు.
కొత్తగా బుల్లెట్ పందేలు: ఈ ఏడాది బుల్లెట్ పందేల పేరుతో కొత్త సంప్రదాయానికి నిర్వాహకులు తెరతీశారు. ఈ ప్రాంతంలో ఇది కొత్తగా ఉండటంతో పందెం ప్రియులు ఆసక్తి చూపారు.
గూడూరు: మండలంలోని బరుల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కోడిపందేల మాటున పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద తినుబండారాల దుకాణాలు వెలిశాయి.
కైకలూరు గ్రామీణం: మండలంలోనూ కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. వాటి మాటున గుండాట, కోతాట కొనసాగించారు. మండల వ్యాప్తంగా రూ.లక్షలు చేతులు మారాయి. రాత్రివేళ ఆటంకం లేకుండా ఫ్లడ్లైట్లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు.
మండవల్లి, న్యూస్టుడే: యథేచ్ఛగా కోడిపందేలను నిర్వహించారు. రూ.5వేల నుంచి రూ.5లక్షల వరకు పందేలు కాశారు. వీటిని తిలకించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్లతో శిబిరాలు కిక్కిరిసిపోయాయి. కొల్లేరు లంక గ్రామాల్లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన బెట్టింగ్రాయుళ్లు పాల్గొన్నారు.
విస్సన్నపేట: మండలంలో విస్సన్నపేట, కొర్లమండ, వేమిరెడ్డిపల్లి, నూతిపాడు, వేమిరెడ్డిపల్లి తండా, తెల్లదేవరపల్లి గ్రామాల్లో పెద్దఎత్తున కోడిపందేలు, జూదం కొనసాగాయి. పుట్రేల, మల్లేల గ్రామాల నడుమ మామిడితోటల్లో నిర్వాహకులు తాత్కాలిక షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు.
చింతపాడులో నిర్వహిస్తున్న కోడిపందేలు
గంపలగూడెం మండలంలో మూడుముక్కలాట
బంటుమిల్లి: పందెం బరి వద్ద గుండాట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!