పాఠంపై పట్టు..సామర్థ్యాల పెంపు
రెండేళ్లుగా విద్యార్థుల చదువులపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. కొన్నాళ్లపాటు తరగతులు నిర్వహించలేని పరిస్థితి. ఆన్లైన్ తరగతులు నిర్వహించినా పలు కారణాలతో అందరూ హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహన
గూడూరు మండలం ఆర్వీపల్లి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే : రెండేళ్లుగా విద్యార్థుల చదువులపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. కొన్నాళ్లపాటు తరగతులు నిర్వహించలేని పరిస్థితి. ఆన్లైన్ తరగతులు నిర్వహించినా పలు కారణాలతో అందరూ హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహన లేక ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యాశాఖపరంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తరగతుల వారీగా విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టుసాధించడంతోపాటు సామర్థ్యం పెంచేదిశగా రూపకల్పన చేశారు. శాఖాపరంగా నిర్వహించే కార్యక్రమాలు....వాటివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై కథనం.
100 రోజుల పఠనం
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ఇప్పటికే చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈనెల ఆరో తేదీనుంచి వంద రోజులపాటు పఠనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోనూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రీప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు ఒకటి, మూడు నుంచి ఐదు, ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయాల్లో విద్యార్థులను చదివించాలి. ఇలా కేవలం పాఠ్యాంశాలే కాకుండా నీతికథలు, మహనీయుల జీవిత చరిత్రలు, స్వాతంత్య్ర సమరయోధులు, శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు వివరించాలి. మధ్యలో పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను పరిశీలించాలి.
ట్విన్నింగ్ పాఠశాలలు
విద్యార్థులకు బోధించే విషయంలో కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. అవసరమైన టీఎల్ఎం తయారీ చేయించడంతోపాటు దృశ్యరూపకంగా కూడా వివరిస్తుంటారు. అలాంటి పాఠశాలలకు సమీపంలోని వేరే పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు వెళ్లి అక్కడ ఉన్న వసతులు పరిశీలించి తాము ఆదిశగా అమలు చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈ ట్విన్నింగ్ పాఠశాలల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు అమలు చేస్తున్నారు. అలా మండలంలో ఓమెరుగైన పాఠశాలను ఎంచుకుని అదే మండలంలో మరొక పాఠశాలను దానికి ట్విన్నింగ్ చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 100 పాఠశాలలను మరో వంద పాఠశాలలకు ట్విన్నింగ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుంచి మరొక దానికివెళ్లి రావడం, ఇతర ఖర్చుల నిమిత్తం ఒక్కో బడికి రూ.1000 ప్రభుత్వం అందజేస్తుంది. ఆర్ట్అండ్క్రాఫ్ట్, స్థానిక పండగలు,. వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
భాషాభివృద్ధి
విద్యార్థులు మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లీషు భాషలపై కూడా పట్టుసాధించేలా చేయాలన్న లక్ష్యంతో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లిప్)ను అమలు చేస్తున్నారు.1 నుంచి 2 తరగతులకు తెలుగు, ఇంగ్లీషు రెండు పదాలు, 3 నుంచి 5తరగతులు తెలుగు, ఇంగ్లీషు మూడు పదాల చొప్పున విద్యార్థులకు నేర్పించాలి. 6 నుంచి 8తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇటీవల వరకు ఐదు పదాలు నేర్పించాలని చెప్పినా ప్రస్తుతం వాటిని మూడు పదాలకు తగ్గించారు. ప్రతి 15 రోజులకోసారి ఆ పదాల జాబితాను ఆర్జేడీ కార్యాలయం విడుదల చేస్తుంది. నేర్చుకున్న పదాలపై పక్షం రోజులకు ఓసారి పరీక్ష నిర్వహించి గ్రేడ్లు కేటాయించాలి. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నా చేసిన మార్పులు, అమల్లో ఉపాధ్యాయుల చేపట్టాల్సిన విధులపై ఇటీవల సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
సమర్థంగా అమలు
విద్యార్థుల్లో భాషానైపుణ్యం, సామర్థ్యాల పెంపుకోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నాం.దీనిలో భాగంగానే డివిజన్ వారీగా ఉపాధ్యాయులకు సదస్సులు నిర్వహిస్తున్నాం. లిప్ కార్యక్రమం అమల్లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు ఒకేచోట రాయించకూడదు. వేర్వేరుగా ఒక పుస్తకంలో ఒక్కో భాషకు 30 పేజీల చొప్పున కేటాయించాలి. ఒకరోజు నేర్పిన పదాలను మరుసటిరోజు విద్యార్థుల చేత చూడకుండా రాయించాలి. ఈ కార్యక్రమాల అమలుపై మండల విద్యాశాఖాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ దిశగా ఆదేశాలు కూడా జారీచేశాం. - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?