logo

ఓఎన్‌జీసీ రిగ్‌లో మంటలు

పెందుర్రు-బంటుమిల్లి రోడ్డులోని ఓఎన్‌జీసీ రిగ్‌లో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న బంటుమిల్లి ఫైర్‌ ఆఫీసర్‌ గుమ్మడి వెంకటేశ్వరరావు అగ్నిమాపక శకటాన్ని అక్కడికి పంపించారు. ఈలోగా మంటలు

Published : 21 Jan 2022 03:11 IST

ఎగసి పడుతున్న మంటలు

బంటుమిల్లి, న్యూస్‌టుడే: పెందుర్రు-బంటుమిల్లి రోడ్డులోని ఓఎన్‌జీసీ రిగ్‌లో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న బంటుమిల్లి ఫైర్‌ ఆఫీసర్‌ గుమ్మడి వెంకటేశ్వరరావు అగ్నిమాపక శకటాన్ని అక్కడికి పంపించారు. ఈలోగా మంటలు అదుపులోకి రావడంతో అగ్నిమాపక సిబ్బంది కొంతసేపు అక్కడ ఉండి వెనుదిరిగారు. అధికారి మాట్లాడుతూ గ్యాస్‌ లీక్‌ కాలేదని, పైపులోని వ్యర్థాలు బయటకు వచ్చి మండాయని, ఇది సర్వసాధారణమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని