బస్సెప్పుడొస్తుందో...!
పల్లెలు అభివృద్ధి బాట పట్టడం మాట అటుంచితే.. కనీస అవసరాలూ తీరని దయనీయ స్థితిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్న వాళ్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యా అధికమే.
కలిదిండి, కైకలూరు, న్యూస్టుడే : పల్లెలు అభివృద్ధి బాట పట్టడం మాట అటుంచితే.. కనీస అవసరాలూ తీరని దయనీయ స్థితిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్న వాళ్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యా అధికమే. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సదుపాయం లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. నిత్యం రద్దీగా ఉండే గ్రామాలకూ బస్సులే నడపడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణానికి సరకు తరలించే వాహనాలు, ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం. విద్యాలయం, అత్యవసర సమయంలో ఆసుపత్రి, ఏదైనా కార్యాలయానికి సకాలంలో వెళ్లాలంటే సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. కలిదిండి, కైకలూరు మండలాల్లో ప్రధాన గ్రామాల్లో మొత్తం జనాభా, బస్సులు నడపాలనే ప్రతిపాదనలు ఎంతకాలంగా అమలుకు నోచుకోలేదో తెలియచెప్పే ఉదాహరణలివి.
మార్గం కలిదిండి - కైకలూరు
గ్రామాలు : కలిదిండి, వెంకటాపురం, ఆరుతెగలపాడు, వరహాపట్నం, గోపవరం, రాచపట్నం, కైకలూరు
జనాభా : 30వేలు విస్తీర్ణం : 15కి.మీ
పరిస్థితి : ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీనిని ఇప్పటి వరకు ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు.
కోరుకొల్లు - కైకలూరు
గ్రామాలు : కోరుకొల్లు, వేమవరప్పాడు, తామర, కొల్లు వింజరం, ఆచవరం, కైకలూరు
జనాభా : 30వేలు విస్తీర్ణం : 12కిమీ
పరిస్థితి : ఈ మార్గంలో గతంలో ఆర్టీసీ బస్సు సదుపాయం ఉండేది. ఉదయం, సాయంత్రం మాత్రమే నడపడంతో, మిగిలిన సమయాల్లో ప్రయాణ అవసరాల కోసం ఆటో ప్రయాణానికి ప్రజలు మొగ్గుచూపారు. దీంతో అధికారులు ఆర్టీసీ బస్సును రద్దు చేశారు. తిరిగి బస్సు సౌకర్యం పునరుద్ధరించలేదు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బస్సు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు ఎక్కువగా వస్తున్నాయి.
కలిదిండి - లోడిదలంక
గ్రామాలు : కలిదిండి, పడమటిపాలెం, లోడిదలంక
జనాభా : 15వేలు విస్తీర్ణం : 10కిమీ
పరిస్థితి : ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు తిరిగేది. కొన్నేళ్ల కిందట రోడ్డు దారుణంగా ధ్వంసం కావడంతో నిలిపివేశారు. కొంతకాలం 108 వాహనం కూడా తిరగలేదు. ఇటీవల రోడ్డు అభివృద్ధి చేశారు. అయినా బస్సు సదుపాయాన్ని తిరిగి ప్రారంభించలేదు.
కలిదిండి - గుర్వాయిపాలెం - పెదలంక
గ్రామాలు : కలిదిండి, గుర్వాయిపాలెం, సంతోషపురం, అమరావతి, భాస్కరరావుపేట, మూలలంక, పెదలంక
జనాభా : 25వేలు విస్తీర్ణం : 16కిమీ
పరిస్థితి : విజయవాడ నుంచి రాత్రి 6 గంటలకు వచ్చిన బస్సు ఉదయం 5 గంటలకు తిరిగి వెళ్తుంది. గుడివాడ నుంచి మూలలంక వరకు ఉదయం 9.30గంటలకు, భీమవరం నుంచి సాయంత్రం 6 గంటలకు ఒక బస్సు ఉంది. మధ్యాహ్నం వచ్చే బస్సు రద్దు చేశారు. దీనిని పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కైకలూరు - ఆలపాడు - కొల్లేరు లంక గ్రామాలు
గ్రామాలు : కైకలూరు, ఆటపాక, భుజబలపట్నం, పల్లెవాడ, ఆలపాడు, వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, కొల్లేటికోట, పందిరిపల్లెగూడెం
జనాభా: 35 వేలు
విస్తీర్ణం: 18 కి.మీ
పరిస్థితి: కొల్లేరు లంక గ్రామాల ప్రజలు కైకలూరు చేరాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు ఏర్పాటు చేయాలని లంక గ్రామస్ధులు కోరుతున్నా, ఇప్పటి వరకు అటుగా అడుగులు పడలేదు.
రామవరం - కైకలూరు
గ్రామాలు : రామవరం, దొడ్డిపట్ల, సీతనపల్లి, వరహాపట్నం, రాచపట్నం, గోపవరం, కైకలూరు
జనాభా : 20 వేలు
విస్తీర్ణం : 15 కిమీ
పరిస్థితి : గతంలో ఈ మార్గంలోని రామవరంలో ఉదయం 7.45గంటలకు బస్సు బయల్దేరి 9గంటలకు కైకలూరు చేరుకునేది. సాయంత్రం 6గంటలకు కైకలూరు నుంచి రామవరం మీదుగా భీమవరం వెళ్లేది. దీంతో విద్యార్థులు, పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లే ప్రజలకు ఆసరాగా ఉండేది. ప్రస్తుతం ఈ సర్వీసు రద్దు చేయడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. బస్సు సర్వీసు పునరుద్ధరించే విషయమై గతంలో మంత్రులతో పాటు గుడివాడ డిపో అధికారులకు వినతిపత్రం అందించారు.
కలిదిండి - మద్వానిగూడెం - పెదలంక
గ్రామాలు : కలిదిండి, మద్వానిగూడెం, కొండంగి, యడవల్లి, మట్టగుంట, పెదలంక
జనాభా : 22వేలు విస్తీర్ణం : 20కిమీ
పరిస్థితి : ఉదయం, రాత్రి 7 గంటల సమయంలో బస్సు సదుపాయం ఉండేది. కొన్నాళ్లుగా ఆ బస్సు రావడం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రతి చిన్న అవసరానికీ కలిదిండి, భీమవరం, గుడివాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఈ మార్గంలో సర్వీసులు పెంచి మరో రెండుసార్లు బస్సు నడిపితే ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
గుడివాడ - ముదినేపల్లి - చిగురుకోట
గ్రామాలు : ముదినేపల్లి, చినకామనపూడి, పెదకామనపూడి, నరసన్నపాలెం, చిగురుకోట
జనాభా : 15వేలు విస్తీర్ణం : 10కిమీ
పరిస్థితి : రహదారి ధ్వంసం కావడంతో ఈ మార్గంలో బస్సు సదుపాయాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఆటోల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. రోడ్డుకు మరమ్మతులు నిర్వహించి, బస్సు రాకపోకలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
కైకలూరు - పెనుమాకలంక - గుడివాడ
గ్రామాలు : కైకలూరు, లోకుమూడి, దెయ్యంపాడు, మనుగునూరు, పెనుమాకలంక, నందిగామలంక, ఉనికిలి
జనాభా : 15 వేలు విస్తీర్ణం : 20 కి..మీ
పరిస్థితి : కైకలూరు నుంచి కొల్లేరు లంక గ్రామాల మీదుగా గుడివాడకు బస్సు సర్వీసు నడిచేది. ఐదేళ్లుగా నిలిపివేశారు. ఈ మార్గంలో బస్సును నడపాలని గ్రామస్థులు ఎన్నోసార్లు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు