logo

ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు

వివిధ విభాగాల్లో ప్రతిభా పాటవాలు చాటిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్‌ నివాస్‌, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.

Published : 27 Jan 2022 02:32 IST

బందరు: వేడుకల్లో ఏర్పాటు చేసిన సీడాప్‌ స్టాల్‌

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: వివిధ విభాగాల్లో ప్రతిభా పాటవాలు చాటిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్‌ నివాస్‌, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఆయా శాఖల్లో పనిచేసే మొత్తం 529 మందికి అందజేశారు. ఎస్పీ సిద్ధార్థకౌశల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, వివిధ శాఖల ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పురస్కారాలు పొందిన వారి వివరాలు...

జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు..

సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సివిల్‌సప్లై డీఎం శ్రీధర్‌, డీఈవో తాహెరాసుల్తానా, డీటీఓ ఎం.పురేంద్ర, సీపీవో జి.భరత్‌కుమార్‌, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సివిల్‌సప్లై డీఎం శ్రీధర్‌, డీఈవో తాహెరాసుల్తానా, డీటీఓ ఎం.పురేంద్ర, కేడీసీసీబీ సీఈవో శ్యామ్‌మనోహర్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎ.మురళీకృష్ణారెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ వై.కిరణ్‌కుమార్‌, ఎన్‌సీఎల్‌పీ పీడీ డి.ఆంజనేయరెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌, స్టేట్‌టాక్స్‌ జేసీ వి.రఘునాధ్‌, ఉద్యానవనశాఖ ఏడీ బి.దయాకరబాబు, మార్కెటింగ్‌ డీడీ ఎం.దివాకరరావు, మైన్స్‌ డీడీ సీహెచ్‌ సూర్యచంద్రరావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టి.శౌరి, నూజివీడు కమిషనర్‌ సయ్యద్‌ అబ్ధుల్‌రషీద్‌, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు, విజయవాడ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు, జిల్లా టూరిజం అధికారి జి.రామలక్ష్మణరావు, జిల్లా అటవీ అధికారి సి.సెల్వం, డివిజనల్‌ పంచాయతీ అధికారులు ఐ.జ్యోతిర్మయి, కేపీ చంద్రశేఖర్‌, కేసీ డివిజన్‌ ఈఈ ఎ.రాజస్వరూప్‌కుమార్‌, పీఆర్‌ ఈఈలు ఏవీఎస్‌ శ్రీనివాస్‌, ఎ.వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ ఎన్‌.కృష్ణనాయక్‌, రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారి సీఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ విభాగాలకు చెందిన వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. జిల్లా పోలీస్‌ శాఖ నుంచి 54మంది, విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి నుంచి 52 మంది అధికారులు సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కలెక్టర్‌, జేసీల చేతుల మీదగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

మంత్రి పేర్ని నాని, కలెక్టర్‌ నివాస్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న జేసీలు శివశంకర్‌, మాధవీలత, శ్రీవాస్‌ నుపూర్‌అజయ్‌కుమార్‌ (హౌసింగ్‌), మోహన్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖాజావలి, డీఆర్‌డీఏ పీడీ సునీత,

జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, డీఎంహెచ్‌వో సుహాసిని, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి (కుడి నుంచి ఎడమకు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని