logo

అభివృద్ధిలో భాగస్వాములవుదాం

మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములవుదామని ప్రవాసాంధ్రుడు వర్రే వెంకట సత్యనారాయణ తన మిత్రులకు పిలుపునిచ్చారు. కోరుకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1975-76 బ్యాచ్‌లో చదువుకున్న వారిలో కొందరు గురువారం కోరుకొల్లులో కలుసుకున్నారు.

Published : 28 Jan 2022 02:17 IST

సత్యనారాయణ దంపతులను సత్కరించిన పూర్వ విద్యార్థులు

కోరుకొల్లు (కలిదిండి), న్యూస్‌టుడే: మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములవుదామని ప్రవాసాంధ్రుడు వర్రే వెంకట సత్యనారాయణ తన మిత్రులకు పిలుపునిచ్చారు. కోరుకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1975-76 బ్యాచ్‌లో చదువుకున్న వారిలో కొందరు గురువారం కోరుకొల్లులో కలుసుకున్నారు. మిత్ర బృందంలో ఒకరైన సత్యనారాయణ అమెరికాలో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న తీరుపై వారంతా హర్షం వెలిబుచ్చారు. కేవలం తమ బాల్య జ్ఞాపకాలతో కాలం గడిపేయకుండా గ్రామాభివృద్ధికి ఏమి చేయవచ్చనే అంశంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, నీరజ దంపతులను సన్మానించారు. పూర్వ విద్యార్థులు చన్నంశెట్టి కృష్ణ, సీహెచ్‌ సీతారామయ్య, నీలపాల సుబ్బయ్య, ఎన్‌.శ్రీహరి, గూడూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని